Chandrababu Naidu:‘‘కోడ్’’తో కోట్లు కొల్లగొట్టి.. స్మగ్లర్లు, గ్యాంగ్‌స్టర్లను మించిన బాబు గారి ఎత్తులు

  • IndiaGlitz, [Tuesday,September 05 2023]

హాలీవుడ్‌తో టూ బాలీవుడ్‌లలో సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్స్‌లో ‘‘కోడ్’’ భాష చుట్టూ తిరిగే సినిమాలు ఎన్నో వచ్చాయి. స్మగ్లర్లు, ఇతర మాఫియా గ్యాంగ్‌లు డ్రగ్స్, డబ్బు, బంగారాన్ని దేశం దాటించడంతో పాటు ఎన్నో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ వుంటారు. వీటిని చూసి మనం ఆనందపడుతూ వుంటాం. ఈ గ్యాంగ్‌లకు ఏమాత్రం తక్కువ కాకుండా దందా సాగించారు టీడీపీ బాస్ చంద్రబాబు నాయుడు. ఇటీవల ఐటీ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2014 నుంచి 2018 మధ్య చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు పలు నిర్మాణ సంస్థల నుంచి ఆయన భారీగా ముడుపులు వసూలు చేశారని ఐటీ శాఖఆరోపించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘‘కోడ్’’భాషను కూడా ఉపయోగించారని ఆదాయపు పన్ను శాఖ నిర్ధారించింది.

కమీషన్లు ఇవ్వకుంటే రూల్స్ కొరడా :

నవ్యాంధ్రకు తొలి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత చంద్రబాబు అవినీతి బాగోతాల్ని ఐటీ శాఖ వెలికి తీసింది. తనకు, తన మనుషులకు కమీషన్ల రాకుంటే నిబంధనల పేరుతో కొరడా ఝళిపించేవారు. వీటి ధాటికి ఎంతటి పెద్ద కాంట్రాక్టర్ అయినా తన దారికి రావాల్సిందే. అలా 2014 నుంచి 2019 మధ్య కాలంలో షాపూర్జీ పల్లోంజీ, లార్సన్ టూబ్రో సంస్థలు కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టిడ్కో ఇళ్లు, అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణంతో పాటు రాజధానిలో ఇతర నిర్మాణ పనులను కలిపి 2018 నాటికి రూ.8 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ పనులు చేశాయి.

స్టీల్, టన్ను అంటూ కోడ్ :

ఈ ముడుపుల వ్యవహారాన్ని చంద్రబాబు తన పీఏ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా నడిపించారు. అంతేకాదు.. బయటివారికి, నిఘా సంస్థలకు ఎలాంటి అనుమానం రాకుండా కోడ్‌ను తీసుకొచ్చారు. డబ్బును ఏ ప్రాంతంలో, ఎవరికి పంపించాలో స్పష్టంగా కోడ్‌ ద్వారానే తెలియజేశారు. ఉదాహరణకు హైదరాబాద్‌లోని వ్యక్తికి డబ్బు పంపాలంటే.. HYD అని, విజయవాడలోని వారికి అయితే విజయ్ అని, విశాఖ అయితే విష్ అని, బెంగళూరు అయితే బాంగ్ అని ఇలా కోడ్‌ను వాడుతూ వాట్సాప్ సంభాషణ చేసుకున్నట్లుగా ఐటీ శాఖ గుర్తించింది. కానీ వీటిలో ఎక్కడా డబ్బు అని గానీ, క్యాష్ అని గానీ పదాలను వాడలేదు. డబ్బుకు బదులుగా స్టీల్ అని .. ఒక కోటిని టన్నుగా పేర్కొన్నారు. ఎవరికి ఎంత ఇవ్వాల్సి వస్తే అన్ని టన్నులుగా చెప్పేవారు. కాంట్రాక్ట్ కంపెనీలకు కన్సల్టెంట్‌గా పనిచేసిన మనోజ్ వాసుదేవ్ పార్ధసానికి, చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు మధ్య నడిచిన చాట్ సంభాషణను స్వాధీనం చేసుకుని ఆ బాగోతాన్ని రట్టు చేశారు ఐటీ అధికారులు.

మీరెవ్వరు నాకు నోటీసులు ఇవ్వడానికి :

పక్కా ఆధారాలతో దొరికిపోయి కూడా తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఏకంగా ఆదాయపు పన్ను అధికారులనే దబాయించారు బాబు గారు. ముడుపుల వ్యవహారంపై నోటీసులు ఇవ్వగా.. దానికి చంద్రబాబు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. పైగా.. మీ అధికార పరిధి ఏంటి.. నాకు నోటీసులు ఇచ్చే అధికారం హైదరాబాద్‌లోని సెంట్రల్ సర్కిల్‌కు లేదంటూ ఎదురుదాడికి దిగారు. అలా గతేడాది అక్టోబర్ 10, 27... ఈ ఏడాది జనవరి 31, జూన్ 20 తేదీల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులకు చంద్రబాబు లేఖ రాశారు. ఇందుకు ఐటీ అధికారులు సైతం అంతే ఘాటుగా బదులిచ్చారు. ముందు ఆ డబ్బుకు వివరణ ఇవ్వాలంటూ తలంటారు. దాదాపు 46 పేజీలతో రివర్స్‌లోనే తనకు నోటీసులు రావడంతో చంద్రబాబు నోట్లో పచ్చి వెలక్కాయి పడినట్లయ్యింది. ఐటీ శాఖ తన జోలికి రాకుండా, ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా కాపాడాలంటూ ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

More News

Rashmika Mandanna:అసిస్టెంట్ పెళ్లికి హాజరైన స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న

సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ నేషనల్ క్రష్ ఇమేజ్ తో తనదైన ఇమేజ్ సొంతం చేసుకున్న శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్న.

Sasivadane:'శశివదనే' నుంచి లిరికల్ సాంగ్ 'డీజే పిల్లా' రిలీజ్

"నా దిల్లే నీ వల్లే టూరింగు టాకీసులా మారెనే

Kushi:'ఖుషి' కలెక్షన్ల ఊచకోత.. మూడు రోజుల్లో 70.23 కోట్ల వసూళ్లు, అమెరికాలో 2 మిలియన్ల దిశగా

విజయ్ దేవరకొండ, సమంత జంటగా ప్రేమ కథల స్పెషలిస్ట్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘‘ఖుషి’’.

BiggBoss Telugu 7:గ్రాండ్‌గా లాంచైన ‘‘బిగ్‌బాస్-7’’ : టెస్టెంట్స్ వీరే, లిస్ట్‌లో శివాజీ, షకీలా.. ఈసారి మామూలుగా వుండదట

రోటీన్‌కు భిన్నంగా ఈ సీజన్‌లో కంటెస్టెంట్ల ఎంపిక జరిగింది. గడిచిన ఆరు సీజన్ల వరకు 21 మంది పాల్గొనగా..

Chandrababu Naidu:చెప్పినంత ఇవ్వకుంటే .. బెదిరింపులు, చంద్రబాబు 'ముడుపుల' దందా ఇలా..?

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని, నిప్పులా బతికానని చెప్పుకునే టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అవినీతి గురించి దశాబ్ధాలుగా ఎందరో విమర్శలు చేస్తూనే వున్నారు.