Chandra Babu:చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

  • IndiaGlitz, [Wednesday,October 04 2023]

విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపసై విచారణను రేపటికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ తరపును సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. సీఐడీ కస్టడీ పిటిషన్ తరపును అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. ఏఏజీ పొన్నవోలు వాదిస్తున్న సమయంలో న్యాయమూర్తి పలు కీలక సందేహాలను లేవనెత్తారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపిస్తూ రిమాండ్ రిపోర్టునే ఆయన మళ్లీ చదివి వినిపించారు. ఈ సమయంలో న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. పదే పదే అవే వాదనలు వినిపిస్తూ సమయం ఎందుకు వృధా చేస్తారని ప్రశ్నించారు. అలాగే ఈ కేసులో ఏ 37కి డబ్బు ముట్టినట్లుగా ఆధారాలు ఉన్నాయా అని న్యాయమూర్తి ప్రశ్నించారు.

జైలులో ఉన్న వ్యక్తి సాక్షులను ఎలా ప్రభావితం చేస్తారు.. న్యాయమూర్తి ప్రశ్న

అయితే చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని అనే వ్యక్తులు విదేశాలకు పారిపోయారని.. వారితో చంద్రబాబుకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు జైల్లో ఉండగానే సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారని.. బెయిల్ ఇస్తే ఇంకా ప్రభావితం చేస్తారని ఆయన వాదించారు. అయితే జైల్లో ఉన్న వ్యక్తి సాక్షుల్ని ఎలా ప్రబావితం చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. అనంతరం ఏదైనా ప్రభుత్వ స్కీంలో స్కాం జరిగిదే.. ఆ శాఖ ఉన్నతాధికారిని బాధ్యుడ్ని చేస్తారా..? ముఖ్యమంత్రిని బాధ్యుడ్ని చేస్తారా..? అని న్యాయమూర్తి ఏఏజీని అడిగారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను రేపు ఉదయానికి వాయిదా వేశారు.

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారు..

అంతకుముందు ఇవాళ ఉదయం విచారణ ప్రారంభం కాగానే స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు తప్పిదం ఏమీ లేదని చంద్రబాబు తరఫున ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. అప్పటి ఆర్థిశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి స్కిల్ డెవలప్‌మెంట్‌పై అధ్యయనం చేశారు అని దూబే వాదించారు. సునీత అధ్యయనం చేసి సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంంతరం తెలపలేదని.. ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న ఆధారాలు ఉన్నాయన్నారు. అలాగే కాస్ట్ ఎవాల్యూషన్ కమిటీలో చంద్రబాబు లేరని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారని వాదించారు. సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు మధ్యంతర బెయిల్‌ను పొడిగించిందని వాదించారు. చంద్రబాబుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని ఇప్పటికే రెండు రోజులపాటు సీఐడీ కస్టడీ తీసుకుని విచారణ చేపట్టిందన్నారు.

More News

Varalaxmi Sarathkumar:డ్రగ్స్ కేసులో నోటీసులంటూ ప్రచారం .. నా ఫోటోతో వార్తలు , ఏం జరిగిందంటే : క్లారిటీ ఇచ్చిన వరలక్ష్మీ

వరలక్ష్మీ శరత్ కుమార్.. ఈ తరంలోని అద్భుతమైన నటీమణుల్లో ఆమె కూడా ఒకరు.

Talasani Srinivas Yadav:చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

టీడీపీ జాతీయాధ్యక్షులు చంద్రబాబు అరెస్టును తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు.

Nobel Prize:రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ అవార్డు

2023 సంత్సరానికి గాను వివిధ విభాగాల్లో సోమవారం నుంచి నోబెల్ అవార్డులు ప్రకటిస్తున్న రాయల్ స్వీడిష్ అకాడమి ఆఫ్ సైన్సెస్ ఇవాళ(బుధవారం)

Devara:జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. దేవర గురించి సూపర్ అప్టేడ్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుకు అదిరిపోయే అప్టేడ్ ఇచ్చారు దర్శకుడు కొరటాల శివ.

Nara Lokesh:స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఈనెల 12వరకు లోకేశ్ ముందస్తు బెయిల్ పొడిగింపు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఏపీ హైకోర్టులో