ర‌వితేజ‌తో చంద‌మామ‌

  • IndiaGlitz, [Wednesday,January 31 2018]

ఈ ఫిబ్ర‌వ‌రి 2న ర‌వితేజ 'ట‌చ్ చేసి చూడు' అంటూ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ర‌వితేజ రెండు సినిమాలున్నాయి. అందులో ఒక‌టి క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గా... వెంకీ, దుబాయ్ శీను వంటి సినిమాల‌ను డైరెక్ట్ చేసిన శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో హ్యాట్రిక్ మూవీ చేయ‌బోతున్నాడు.

ఈ సినిమా ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇందులో ర‌వితేజ మూడు పాత్ర‌ల్లో క‌నిపిస్తార‌ని, దీనికి 'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ప్రీ ప్రొడ‌క్ష‌న్‌లో భాగంగా హీరోయిన్స్ ఎంపిక జ‌రుగుతుంది.

ఓ హీరోయిన్‌గా నివేదా థామ‌స్ న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపించాయి. కాగా రెండో హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంద‌ని అంటున్నారు. గ‌తంలో వీరిద్ద‌రూ సారొచ్చారు, వీర చిత్రాల్లో జోడిగా న‌టించారు. ఇది ఇద్ద‌రికీ హ్యాట్రిక్ మూవీ అవుతుంది.

More News

హీరో నిఖిల్ విడుదల చేసిన 'రాజరథం' లోని 'నీలిమేఘమా'

ఈ సంగీతపు శుభసాయంత్రాన 'రాజరథం' టీం మరో పాటని విడుదల చేసింది.

సాయిధరమ్ తేజ్ కెరీర్ గ్రాఫ్ లో గొప్పగా చెప్పుకునే చిత్రం 'ఇంటిలిజెంట్ ' - నిర్మాత సి.కళ్యాణ్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్,లావణ్య త్రిపాఠి జంటగా సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లి.

ఒకే రోజున తండ్రీ కొడుకుల సినిమాలు

చిత్ర పరిశ్రమ అంటేనే చిత్ర విచిత్రాలకు కొలువు.అలాంటి పరిశ్రమలో..

ఆ ఇద్దరూ సమ్మర్ నే టార్గెట్ చేశారు

'జయం'.. పదహారేళ్ళ క్రితం తెలుగు తెరపై సంచలనం సృష్టించిన సినిమా పేరిది.

ముగ్గురు భామలు.. తొలి అడుగులు

ఫిబ్రవరి 2..ముగ్గురు ముద్దుగుమ్మలకు ప్రత్యేకం కానుంది.ఎందుకంటే..