ఝార్ఖండ్‌ కొత్త సీఎంగా చంపయీ సోరెన్.. హేమంత్ సోరెన్ అరెస్ట్..

  • IndiaGlitz, [Thursday,February 01 2024]

లోక్‌సభ ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఇటీవల ఆయనను విచారిస్తు్న్నారు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం రాంచీలోని హేమంత్ ఇంటికి చేరుకున్న అధికారులు దాదాపు 7 గంటలకు పైగా విచారించారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున రాంచీకి చేరుకున్నారు. మరోవైపు గిరిజన సంఘాలు సోరెన్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి.

అరెస్టుకు ముందు ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. సీఎంగా అతని భార్య కల్పనా సోరెన్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఆమె అభ్యర్థిత్వాన్ని తోటి కోడలు సీతా సోరెన్ ఖండించారు. దీంతో హేమంత్ సొరేన్‌కు సన్నిహితుడైన ఝార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నేత, రవాణాశాఖ మంత్రి చంపయీ సోరెన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో ఎమ్మెల్యేలంతా రాజ్ భవన్‌కు గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను కలిశారు. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. వీలైనంత త్వరగా చంపయీ సోరెన్ తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలని అభ్యర్థించారు.

చంపయీ సోరెన్ 1991 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం సెరికెల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జేఎంఎం పార్టీ అధినేత శిబు సోరెన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు గడించారు. ఇదిలా ఉంటే ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా ఈడీ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటు హేమంత్‌ అరెస్ట్‌ను

More News

వైసీపీ 5వ జాబితా విడుదల.. నరసరావుపేట ఎంపీ అభ్యర్థి ఎవరంటే..?

ఇటీవల ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్.. అభ్యర్థుల కసరత్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే నాలుగు జాబితాల్లో 58 ఎమ్మెల్యే, 10 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు

YCP సోషల్ మీడియా పోరాటంతోనే కుమారి ఆంటీకి న్యాయం

ఇటీవల పాపులర్ అయిన కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. చిరు వ్యాపారులకు తమ ప్రభుత్వం భరోసాగా ఉంటుందని తెలిపారు. త్వరలోనే తాను స్వయంగా వచ్చి ఫుడ్ స్టాల్‌ను

వాహనదారులకు గుడ్ న్యూస్.. చలాన్ల గడువు మరోసారి పెంపు..

రాయితీతో పెండింగ్ చలాన్లు చెల్లించని వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. నేటితో ముగుస్తున్న గడువును ఫిబ్రవరి 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Gyanvapi: జ్ఞానవాపి కేసులో కీలక పరిణామం.. మసీదులో పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతి..

జ్ఞానవాపి మసీదు వివాదం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మసీదు ప్రాంగణలో సీల్ చేసి ఉన్న బేస్‌మెంట్‌లో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతినిచ్చింది.

మద్యం మత్తులో కండక్టర్‌పై యువతి దాడి.. ఆర్టీసీ యాజమాన్యం ఆగ్రహం..

హైదరాబాద్‌లో ఓ యువతి ఆర్టీసీ బస్సులో హల్‌చల్ చేసింది. హయత్‌నగర్ బస్ డిపో-1కు చెందిన బస్సు హయత్ నగర్ నుంచి అప్జల్ గంజ్ బయల్దేరింది. హయత్‌నగర్ బస్టాప్‌లో ఓ యువతి మద్యం మత్తులో బస్సు ఎక్కింది.