Medigadda Barrage: మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌ని పరిశీలించిన కేంద్ర బృందం

  • IndiaGlitz, [Tuesday,October 24 2023]

కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌ని కేంద్ర బృందం పరిశీలించింది. వంతెన కుంగిన ఘటనపై ఆరుగురు నిపుణులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ నేడు బ్యారేజ్‌ను పరిశీలించి నివేదిక రూపొందించింది. వంతెన కుంగిన ప్రాంతాన్ని, పగుళ్లు ఏర్పడిన ప్రదేశాన్ని కేంద్ర బృందం సభ్యులు ప్రత్యక్షంగా పరిశీలించారు. 20వ పిల్లర్ వద్ద పగుళ్లకు గల కారణాలను అన్వేషించారు. బ్యారేజ్ పటిష్ఠత, జరిగిన నష్టంపై కమిటీ అంచనా వేయనుంది. ఎలా కుంగింది అనే విషయాన్ని ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిశీలన పూర్తయిన తర్వాత బ్యారేజీ నుంచి కేంద్ర బృందం సభ్యులు వెనుదిరిగారు. మరో రెండు రోజుల్లో కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక అందజేయనున్నారు.

భారీ శబ్దంతో కుంగిపోయిన 20వ పిల్లర్..

ఈ బ్యారేజీ కుంగడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే నీటిని విడుదల చేశారు. దీంతో నీటి మట్టం కనిష్ఠస్థాయికి చేరుకుంది. బ్యారేజ్ ఎగువ నుంచి 57 గేట్ల ద్వారా 22,500 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేశారు. గత శనివారం రాత్రి భారీ శబ్దంతో 20వ పిల్లర్ కుంగిపోయింది. దీంతో బీ బ్లాక్‌లోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. అలాగే బ్యారేజీ క్రస్ట్ గేటుకు పగుళ్లు కూడా వచ్చాయి. అధికారులు వంతెనను మూసివేసి రాకపోకలను నిలిపివేశారు. గోదావరిపై ఉన్న ఈ బ్యారేజీకి ఒకవైపు మహారాష్ట్ర, రెండోవైపు తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.

కేంద్ర జలవనరులశాఖ మంత్రికి లేఖ రాసిన కిషన్ రెడ్డి..

బ్యారేజీ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డ్యామ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బ్యారేజీ భద్రతను పర్యవేక్షించేందుకు వెంటనే కేంద్ర బృందాన్ని పంపాలంటూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన షెకావత్ కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా బ్యారేజీ కుంగిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మొదటి దోషి కేసీఆర్ కుటుంబమేనని ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేసీఆర్, కాంట్రాక్టర్లు కలిసి దోచుకున్నారని తెలిపారు. బ్యారేజ్ కుంగడంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారణ జరపాలని రేవంత్ కోరారు.

More News

Srilanka: శ్రీలంక వెళ్లాలనుకునే భారతీయులకు గుడ్ న్యూస్.. ఇక ఆ అవసరం లేదు..

శ్రీలంక ప్రభుత్వం భారతీయులకు శుభవార్త అందించింది. ఇక నుంచి వీసా అవసరం లేకుండానే తమ దేశం రావొచ్చని ప్రకటించింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana TDP: తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీపై కాసాని జ్ఞానేశ్వర్ క్లారిటీ

తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉందనే ప్రచారంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే కుట్ర ప్రకారం విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Mega156: మెగా 156 షూటింగ్ మొదలు.. ఘనంగా జరిగిన పూజా కార్యక్రమం

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు దసరా పండుగ ట్రీట్ ఇచ్చారు. 156వ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది.

Mallareddy: గత స్మృతులు గుర్తుచేసుకుంటూ 40ఏళ్ల నాటి స్కూటర్‌పై మంత్రి మల్లారెడ్డి చక్కర్లు

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఏం చేసినా వైరల్ అవుతూ ఉంటుంది. విజయదశమి సందర్భంగా ఆయన తన గత స్మృతులను గుర్తు చేసుకున్నారు.

Jaggareddy: నేనే సీఎం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో జరిగిన దసరా ఉత్సవాల్లో పాల్గొన్న జగ్గారెడ్డి..