close
Choose your channels

CAA: కేంద్రం మరో సంచలన నిర్ణయం.. సీఏఏ అమలు చేస్తూ నోటిఫికేషన్..

Monday, March 11, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

CAA: కేంద్రం మరో సంచలన నిర్ణయం.. సీఏఏ అమలు చేస్తూ నోటిఫికేషన్..

లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం(CAA)ను నేటి నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2019 డిసెంబర్ 11వ తేదీన ఈ పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందింది. దీనికి సంబంధించి అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా సంతకం చేశారు. అయితే ఈ చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో నిబంధనలు, విధివిధానాలు మాత్రం ఇప్పటివరకు కేంద్రం రూపొందించలేదు. తాజాగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ చట్టాన్నిఅమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది.

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి భారత్ పౌరసత్వాన్ని ఇచ్చేందుకు కేంద్రం ఈ నిబంధనల్ని రూపొందించింది. దీని ప్రకారం 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు భారత్ పౌరసత్వం లభిస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ముగుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన నిబంధనలు నోటిఫై చేయడంతో ఈ చట్టం అమలులోకి వచ్చింది. కాగా ఎన్నికల ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇటీవల పలుమార్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

CAA: కేంద్రం మరో సంచలన నిర్ణయం.. సీఏఏ అమలు చేస్తూ నోటిఫికేషన్..

అయితే 1995లో వచ్చిన పౌరసత్వ చట్టానికి సవరణలు చేస్తూ 2019లో ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చింది. 1995 చట్టంలో తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంలో విదేశాల నుంచి వలస వచ్చిన ముస్లింలను మినహాయించడం తీవ్ర దుమారం రేపింది. దీంతో 2019లో తీసుకువచ్చిన ఈ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఆందోళనలు, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని కొన్ని బీజేపీయేతర రాష్ట్రాలు.. సీఏఏను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తమ రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేయమని తేల్చి చెప్పాయి. మొత్తానికి ఎన్నికల వేళ కీలకమైన సీఏఏ చట్టం అమల్లోకి తీసుకురావడం బీజేపీ మాస్టర్ ప్టాన్‌ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment