సుజనాకు షాకిచ్చిన సీబీఐ.. హార్డ్ డిస్క్‌లు స్వాధీనం

  • IndiaGlitz, [Saturday,June 01 2019]

కేంద్ర మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నేత సుజనా చౌదరికి సీబీఐ అధికారులు సడన్ షాకిచ్చారు. శనివారం నాడు నివాసంతో పాటు, ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదా చేస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చిన సీబీఐ అధికారులు పలు బృందాలుగా విడిపోయి.. పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లోని సుజనా చౌదరి కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు.

కాగా.. శనివారం ఉదయమే సీబీఐ అధికారులు రంగంలోకి దిగినప్పటికీ ఎక్కడా సమాచారం పొక్కలేదు.. సాయంత్రం ఈ విషయం బయటికి రావడం గమనార్హం. నగరంలో మొత్తం మూడుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో భాగంగా.. పలు హార్డ్ డిస్క్‌లను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. మరోవైపు.. నలుగురు సుజనా గ్రూప్‌ డైరెక‍్టర్లను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. శ్రీనివాస కళ్యాణ్‌రావు, వెంకట రమణారెడ్డి, సుధాకర్‌ రెడ్డి, రామకృష్ణ వర్మను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు.

కర్నాటకలో సుజనా, సీబీఐ డైరెక్టర్ విజయరామారావ్ కుమారుడు ఇద్దరూ కలిసి ‘బెస్ట్ అండ్ కాంఫ్టన్’ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. అచితూ కంపెనీ పేరుతో అక్రమంగా రుణాలు తీసుకోగా.. గతంలోనే ఈడీతో పాటు సీబీఐ కూడా కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే సోదాల్లో ఏమేం దొరికాయి..? ఇంకా ఎంతసేపు సోదాలు జరుగొచ్చు..? అనే విషయాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ సోదాల గురించి సుజనా చౌదరిగానీ, ఆయన కుటుంబ సభ్యులుగానీ.. సీబీఐ అధికారులు మాట్లాడలేదు. సోదాలు పూర్తయిన తర్వాత అధికారులు మీడియాకు వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More News

'కిషన్‌రెడ్డికి అమిత్ షా క్లాస్.. అసలేం జరిగింది!?

కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రిగా బాధ్యత‌లు చేపట్టిన తర్వాత కిషన్ రెడ్డి ఒకింత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

'సెవెన్'లో థ్రిల్‌తో పాటు రొమాన్స్ కూడా ఉంటుంది: హవీష్

హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ 'సెవెన్'.

త‌మ‌న్నా రాజ‌కీయాలు నేర్చుకుంటుందా?

సిల్వ‌ర్ స్క్రీన్ మీద స‌క్సెస్‌ఫుల్‌గా వెలిగిన వారు రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డం అనేది మ‌న ద‌గ్గ‌ర కొత్తేమీ కాదు.

కాజ‌ల్‌... వితౌట్‌..

వితౌట్ మేక‌ప్‌తో కాజ‌ల్ పెట్టిన ఫొటోలు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ముఖం మీద తేలిక‌పాటి మ‌చ్చ‌ల‌తో కాజ‌ల్ పోస్ట్ చేసిన ఫొటోల గురించే ఇప్పుడు అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.

రంజాన్ కానుకగా జూన్ 7న 'కిల్లర్'

ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం 'కొలైగారన్‌'..