సుశాంత్ వంట మనిషి విచారించిన సీబీఐ

  • IndiaGlitz, [Friday,August 21 2020]

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి పెను సంచలనానికి తెరదీసిన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. సూపరింటెండెంట్ నుపుర్ ప్రసాద్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. కాగా.. ఈ సీబీఐ అధికారులు ఇప్పటికే విచారణను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ముంబై పోలీసులను కలిసి సుశాంత్ కేసుకు సంబంధించిన రికార్డులను, పోస్టుమార్టం రిపోర్టును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సుశాంత్ కేసులో కీలక సాక్షి అయిన ఆయన వంట మనిషిని సీబీఐ అధికారులు విచారించారు.

సుశాంత్ మరణించినప్పటి నుంచి అతడి మరణానికి సంబంధించి అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్‌లో నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అంటుంటే, మరికొందరేమో సుశాంత్ హత్యకు గురయ్యాడని ఆరోపిస్తున్నారు. మరోవైపు సుశాంత్ తండ్రి కేకే సింగ్ కూడా తన కుమారుడిని రియా చక్రవర్తి తీవ్ర వేధింపులకు గురి చేసిందని.. అతడి అకౌంట్ నుంచి రూ.15 కోట్లు బదిలీ చేసుకుందని బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి బదిలీ చేసింది. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

మరోవైపు సుశాంత్ మృతి కేసులో అండర్ వరల్డ్ ప్రమేయముందని మాజీ ‘రా’ అధికారి ఒకరు ఆరోపించారు. సుశాంత్ హత్యకు భారీ మొత్తంలో డబ్బు చేతులు మారిందని.. పైగా ఎలాంటి కేసూ లేకుండా చూస్తామని చెప్పి అండర్ వరల్డ్ చేత హత్య చేయించి ఉంటారని సదరు అధికారి అనుమానం వ్యక్తం చేశారు. సుశాంత్ కేసులో పోలీసుల దృష్టిని తమ నుంచి మరల్చేందుకే అతని అకౌంట్ నుంచి వేరే అకౌంట్లకు డబ్బును బదిలీ చేసేందుకు యత్నించారని కూడా ఆరోపించారు. ఏదైతేనేమి ఈ కేసులో నిజానిజాలు మాత్రం సీబీఐ వెలుగులోకి తీసుకొస్తుందని ప్రతి ఒక్కరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

More News

'బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది' టైటిల్ లుక్ విడుదల

కామెడీ హీరో షకలక శంకర్ లీడ్ రోల్ లో మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్ సమర్పణ లో రూపొందిన అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ హారర్  కామెడీ

ఇది శాశ్వతం కాదు. తాత్కాలిక కష్టమే.. ప్లీజ్.. ప్లీజ్: చిరంజీవి

ఏవో చిన్నాచితకా సినిమాలు తప్ప పెద్దగా షూటింగ్స్ ఏమీ మొదలు కాలేదు. దీంతో సినీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ పేలుళ్లు

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో పేలుళ్లు సంభవించాయి.

సుశాంత్ మృతితో అండర్ వరల్డ్‌కు సంబంధాలున్నాయి: మాజీ ‘రా’ అధికారి

బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతిపై మాజీ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో లక్షకు చేరువలో కేసులు.. నేడు ఎన్నంటే..

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది.