కేతరీన్ సరికొత్త డ్యాన్స్

  • IndiaGlitz, [Monday,May 07 2018]

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, స్టైల్ సాధించుకొన్న నటీమణి కేతరీన్ థెరీసా. ఈ అందాల భామ ఇటీవల నేనే రాజు నేనే మంత్రితో నటిగా మంచి విజయంతోపాటు పేరు కూడా సంపాదించుకొంది. త్వరలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైతీ మూవీ మేకర్స్ రవితేజ హీరోగా రూపొందించనున్న చిత్రంలో కథానాయికగా నటించే క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకొంది.

ప్రస్తుతం ఓ రెండువారాల పాటు న్యూయార్క్ లో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేయడం కోసం అమెరికా వెళ్ళిన కేతరీన్.. అక్కడ మిస్ వీ అనే వరల్డ్ పాపులర్ డ్యాన్సర్ దగ్గర క్రాష్ కోర్స్ జాయిన్ అయ్యింది. ఆల్రెడీ మంచి డ్యాన్సర్ అయిన కేతరీన్ తన కొత్త గురువు మిస్.వీ దగ్గర పాపింగ్ అండ్ లాకింగ్ స్టైల్ లో ట్రయినింగ్ తీసుకోనుంది. ఆల్రెడీ ట్రయినింగ్ మొదలయ్యింది. ఈ సరికొత్త డ్యాన్స్ మూవ్స్ కేవలం తన డ్యాన్సింగ్ స్కిల్స్ పెంపొందించుకోవడం కోసం మరియు తన సరికొత్త సినిమాలలో ప్రేక్షకులను అలరించడం కోసమేనని కేతరీన్ పేర్కొంది. 

More News

రెగ్యులర్ షూటింగ్‌లో సుమంత్ 25వ చిత్రం సుబ్రహ్మణ్యపురం

ఇటీవల మళ్ళీ రావా వంటి ఓ వైవిధ్యమైన చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రామిసింగ్  హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సుబ్రహ్మణ్యపురం

మ‌హిళా ద‌ర్శ‌కుల‌తోనే..

ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా కె.వి.ఆనంద్ రూపొందించిన  తమిళ అనువాద చిత్రం 'అనేకుడు'(2015)తో తెలుగు ప్రేక్షకులని పలకరించిన ముద్దుగుమ్మ అమైరా ద‌స్తూర్‌.

సుకుమార్‌కు ప్ర‌త్యేక‌మైన రోజు ఇది

'రంగస్థలం'తో సంచలన విజయం అందుకున్న ద‌ర్శ‌కుడు సుకుమార్. 1980ల నాటి గ్రామీణ వాతావరణాన్ని పునః సృష్టించి వెండితెరపై మ్యాజిక్ చేశారు.

విభిన్నమైన చిత్రాలని నిర్మించగల ప్రతిభ ని తయారు చేయడమే లక్ష్యం - నాగార్జున

'AISFM గ్రాండ్ ఫిలిం ఫెస్టివల్ 2018 ' లో భాగంగా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిలిం స్కూల్ విద్యార్థులు నిర్మించిన 8  చిత్రాల ప్రదర్శన అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ ఫిలిం అండ్ మీడియా (AISFM)

'నా నువ్వే' ఓ బ్యూటీఫుల్ మ్యూజికల్ ల‌వ్ స్టోరీ - నంద‌మూరి క‌ల్యాణ్ రామ్

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం 'నా నువ్వే'.