మోసగాడి వలకు చిక్కిన ఎంపీ కేకే.. లాస్ట్‌లో కథ అడ్డం తిరిగింది..

ఎంపీ కేకే చాలా సులభంగా మోసగాడి వలకు చిక్కేశారు. అయితే లాస్ట్‌లో కథ అడ్డం తిరిగింది. మహేష్ అనే మోసగాడు ఎంపీ కేకేకు ఫోన్ చేసి.. తనను తాను కేంద్ర పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పరిచయం చేసుకున్నాడు. నిరుద్యోగులకు రుణాలిస్తున్నామని.. కాబట్టి కేకే నియోజకవర్గంలోని ఓ పాతిక మందిని ప్రతిపాదిస్తే వారికే రుణం అంద చేస్తామని తెలిపాడు. ఒక్కొక్కరికీ రూ.25 లక్షల మేర రుణం ఇస్తామని.. అందులో కేంద్ర సబ్సిడీ 50 శాతమని నమ్మబలికాడు. దీని కోసం మంత్రి కేటీఆర్ పేరును సైతం సదరు మోసగాడు వాడుకున్నాడు. కేటీఆర్ చెబితేనే మీకు ఫోన్ చేశానని కేకేకు చెప్పాడు.

కేటీఆర్ పేరు చెప్పడంతో నమ్మేసిన కేకే.. వెంటనే తన కూతురు విజయలక్ష్మికి ఫోన్ చేసి విషయం చెప్పారు. విజయలక్ష్మి గద్వాల్ కార్పొరేటర్‌గా పని చేస్తున్నారు. వెంటనే విజయలక్ష్మి ఒక 25 మంది నిరుద్యోగులను ఎంపిక చేశారు. వెంటనే మహేష్‌కు ఫోన్ చేశారు. అయితే ప్రతి లబ్ధిదారుడు ముందుగా రూ.1.2లక్షలను కాషన్ డిపాజిట్‌గా చెల్లించాలని షరతు పెట్టాడు. ఎలాంటి అనుమానాన్ని రానివ్వకుండా డీడీలు కట్టాలని సూచించాడు. అయితే అప్పటికే మధ్యాహ్నం 3 గంటలు దాటడంతో బ్యాంక్ క్లోజింగ్ సమయం కావడంతో తన ఖాతాలో డిపాజిట్ చేయాలని తెలిపాడు. దీంతో ఎంపీ కేకేకు అనుమానం వచ్చింది.

మహేష్‌కు ఫోన్ చేసిన కేకే ఎక్కడున్నారని ప్రశ్నించారు. దీంతో మహేష్ తాను ప్రగతి భవన్‌లో ఉన్నానని.. మంత్రి కేటీఆర్‌కు ఈ స్కీమ్ గురించి వివరిస్తున్నానని వెల్లడించారు. వెంటనే కేకే.. కేటీఆర్‌కు కాల్ చేశారు. కాగా.. కేటీఆర్ తాను ఢిల్లీలో ఉన్నానని చెప్పడంతో షాక్ అయ్యారు. దీంతో తనకు ఫోన్ చేసిన వ్యక్తి మోసగాడని కేకే గ్రహించారు. అప్పటికే రూ.50 వేలు డిపాజిట్ చేసిన అఖిల్ అనే నిరుద్యోగితో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో‌ ఫిర్యాదు చేయించారు. విచారణ ప్రారంభించిన పోలీసులు మోసగాడు నిజామాబాద్‌లోని ఓ ఏటీఎం నుంచి రూ.40 వేలు డ్రా చేసినట్టు గుర్తించారు. ఆ ఏటీఎంకి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ సాయంతో మోసగాడిని గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

More News

సెప్టెంబర్ 14 నుంచి ప్రత్యేక ఏర్పాట్ల నడుమ పార్లమెంట్ సమావేశాలు..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ సమావేశాలు నిర్వహించనున్నారు.

తెలంగాణలో 3 వేలు దాటిన కేసులు.. ఇవాళ ఎన్నంటే..

తెలంగాణలో తొలిసారిగా కరోనా కేసులు 3 వేల మార్కును దాటేశాయి. పరీక్షల సంఖ్యను కూడా పెంచడం దీనికి కారణం కావొచ్చు.

‘బిగ్‌బాస్-4’కి షాక్.. కంటెస్టెంట్‌కి కరోనా!

బిగ్‌బాస్ షో ప్రారంభం అవుతుందంటేనే ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు..

'క‌‌ల‌ర్ ఫొటో' నుంచి ఆగ‌స్ట్ 27న రానున్న మొద‌టి పాట

అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై శ్ర‌వ‌ణ్ కొంక‌, లౌక్య ఎంట‌ర్ టైన్మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాత‌లుగా

ప‌వ‌న్ స‌ర‌స‌న బ‌న్నీ హీరోయిన్‌...?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్ అన‌గానే మ‌న‌కు వెంట‌నే గుర్తుకొచ్చే సినిమా ‘గ‌బ్బ‌ర్ సింగ్‌’.