ప్రభాస్ ‘ఆదిపురుష్’కి షాక్.. వారిపై కేసు నమోదు

  • IndiaGlitz, [Thursday,December 17 2020]

ప్రభాస్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’ను ప్రకటించిన నాటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో అయితే దీని గురించిన అప్‌డేట్స్ ప్రేక్షకులను ఎంతో ఆనందపరిచేవి.. కానీ ఇప్పుడు మాత్రం మండిపడేలా చేస్తున్నాయి. దీనికి కారణం సినిమా గురించి ఇటీవల రావణాసురుడి పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

‘ఆదిపురుష్’ సినిమాలో రావణాసురుడి పాత్రకు అత్యంత ప్రాధాన్యముందని.. ఆ పాత్రను దయగల, మానవత్వంతో కూడిన వ్యక్తిగా చూపించబోతున్నట్టు సైఫ్ అలీఖాన్ తెలిపారు. అంతటితో ఆగక లక్ష్మణుడు.. తన సోదరి సూర్పనక ముక్కు కోసినందుకే సీతను రావణుడు అపహరించాడని... అందులో తప్పు లేదన్నట్టు మాట్లాడారు. ఈ మాటలు.. హిందువులకు ఆగ్రహావేశాలు తెప్పించాయి. సైఫ్ మాటలు హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని కోర్టులో పిటిషన్ సైతం దాఖలైంది.

సనాతన ధర్మం గురించి సైఫ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని.. ఉత్తరప్రదేశ్‌ జౌన్‌పూర్ జిల్లాలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హిమాన్షు శ్రీవాస్త‌వ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. సైఫ్‌తో పాటు దర్శకుడు ఓం రౌత్‌పై కూడా కేసు నమోదు చేశారు. దీంతో సైఫ్ దిగిరాక తప్పలేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను.. సైఫ్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇక ప్ర‌స్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతుండ‌గా.. వ‌చ్చే ఏడాది సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఈ క్ర‌మంలో ఆదిపురుష్ కోసం ప్ర‌భాస్ వ‌ర్కౌట్లు కూడా ప్రారంభించేశారు.

More News

మోనాల్ రెమ్యూనరేషన్‌పై షాకింగ్ న్యూస్..

బిగ్ బాస్ దత్తపుత్రికగా పేరొందిన మోనాల్ గజ్జర్ రెమ్యునరేషన్ విషయంలో షాకింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.

ప్రియురాలి కోసం సముద్రాన్నే దాటాడు.. అక్కడే కథ అడ్డం తిరిగింది

ప్రియురాలి కోసం ఏకంగా సముద్రాన్నే దాటాడు.. చివరిగా ప్రియురాలిని కలుసుకున్నాడు.. అంతా బాగుందని ఎంజాయ్ చేస్తూ ప్రియురాలితో కలిసి ఓ నైట్ క్లబ్‌కు వెళ్లాడు.. డామిట్..

మెగాస్టార్ ‘లూసిఫర్’ అప్‌డేట్ వచ్చేసింది

మోహ‌న్ లాల్ న‌టించిన మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్టర్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌‌లో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న విషయం తెలిసిందే. చిరంజీవి 153వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

సైనికుడిగా విజయ్ దేవరకొండ

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌రుస సినిమాల‌కు క‌మిట్ అవుతున్నాడు. ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ చేస్తున్న లైగ‌ర్ సినిమా సెట్స్‌పై ఉన్న సంగ‌తి తెలిసిందే.

త‌మ‌న్ కాపీ ట్యూన్‌.. ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్‌

మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ త‌మ‌న్‌కు ప్ర‌స్తుతం నెంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ ప‌నిచేస్తున్నాడు. చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన ఇలాంటి త‌రుణంలో త‌మ‌న్ చేసిన ఓ చిన్న త‌ప్పు..