హిందూపురంలో ఆందోళన.. బాలయ్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

  • IndiaGlitz, [Sunday,January 30 2022]

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. జిల్లాల విభజన, వాటి పేర్ల విషయంలో జగన్ సర్కార్ తలనొప్పులు ఎదుర్కొంటోంటి. ఇప్పటికే కడప జిల్లాలో రాయచోటి కేంద్రంగా ఏర్పడనున్న అన్నమయ్య జిల్లాకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అటు కృష్ణా జిల్లాలో కొత్తగా ఏర్పడనున్న విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రభుత్వం తెలిపింది. అయితే దీనికి వంగవీటి రంగా పేరు పెట్టి.. మచిలీపట్నం కేంద్రంగా వున్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలంటూ డిమాండ్లు వస్తున్నాయి.

అనంతపురం జిల్లాలో పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా.. ఆ నిర్ణయాన్ని హిందూపురం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. అయితే.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్‌లు స్థానికులకు మద్ధతుగా స్పందించ‌డం లేదు. దీంతో జనం వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ప్రజా ప్రతినిధిలు క‌న‌బ‌డ‌టం లేదని ఏకంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

స్థానిక వన్‌టౌన్ పోలీసు సేష్ట‌న్ లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ లు క‌న‌బ‌డ‌టం లేద‌ని కంప్లయింట్ ఇచ్చారు. ఇప్పటికైనా వారంతా బయటికి వచ్చి, వెంటనే పదవులకు రాజీనామా చేసి.. హిందూపురం జిల్లా ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేస్తున్నారు.

More News

సీఎం కేసీఆర్ కుటుంబంలో విషాదం.. మేనమామ కమలాకర్ రావు కన్నుమూత

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన మేనమామ గునిగంటి కమలాకర్ రావు (94) కన్నుమూశారు.

సాయిపల్లవిపై బాడీ షేమింగ్‌‌ కామెంట్స్: మహిళల ఎదుగుదలను ఓర్వలేరు.. గవర్నర్ తమిళిసై ఆగ్రహం

నేచురల్ స్టార్ నాని  హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘శ్యామ్ సింగరాయ్’’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు రీఓపెన్.. తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన

కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.

రాజమౌళి ప్రశంసలు అందుకున్న జీ 5 ఒరిజినల్ సిరీస్ 'లూజర్ 2'... నటుడు శశాంక్

ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ 5'లో విడుదలైన ఒరిజినల్ సిరీస్ 'లూజర్' చూశారా? ఆ సిరీస్‌ను అంత త్వ‌ర‌గా వీక్షకులు మర్చిపోలేరు.

భారత్ పెగాసస్‌ను 2017లోనే కొనుగోలు చేసింది... న్యూయార్క్ టైమ్ సంచలన కథనం

గతేడాది భారత రాజకీయాల్లో ‘‘పెగాసస్’’ ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిపక్షనేతలు, మీడియా సంస్థల అధినేతలు,