సమ్మక్క- సారలమ్మలపై వ్యాఖ్యలు: చిక్కుల్లో చిన్నజీయర్ స్వామి, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. ఆదివాసీల నిరసన

  • IndiaGlitz, [Thursday,March 17 2022]

ప్రముఖ ఆధ్యాత్మిక గురు చినజీయర్ స్వామి చిక్కుల్లో పడ్డారు. ఆదివాసీల వనదేవతలు సమ్మక్క-సారలమ్మలను కించపరిచేలా మాట్లాడిన చినజీయర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యంలో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివాసీల ఆడబిడ్డల చరిత్ర తెలియని జీయర్‌స్వామికి వారి గురించి మాట్లాడే హక్కు లేదంటూ ఆదివాసీ నేతలు ఫైరయ్యారు.

కులపిచ్చితో జనాల దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న చరిత్ర చినజీయర్‌దని ఆరోపించారు. అడవి బిడ్డలపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన జీయర్‌స్వామి వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. అటు చినజీయర్ వ్యాఖ్యలపై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా తల్లులది వ్యాపారమా?... మీరు సమాతామూర్తి విగ్రహం ఏర్పాటుతో చేసింది వ్యాపారమా అంటూ సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదని.. కానీ మీరు పెట్టిన 120 కిలోల బంగారు సమతామూర్తి విగ్రహం చూడ్డానికి 150 రూపాయలు టికెట్ ధర పెట్టారంటూ ఆమె ఎద్దేవా చేశారు. సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గర ఇలాంటి వ్యాపారం జరగదు అని సీతక్క ధ్వజమెత్తారు.

సమ్మక్క సారలమ్మ జాతరను కించపరుస్తూ చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మేడారంలో చిన్న జీయర్ స్వామి దిష్టిబొమ్మను ఆదివాసీ నేతలు దగ్ధం చేశారు. చిన్న జీయర్ స్వామి చిత్రపటానికి చెప్పుల దండలు వేసి ఆదివాసీ గిరిజనులు తమ నిరసనను తెలియజేశారు. అగ్రకులాల అహంకారాన్ని ప్రదర్శిస్తూ జీయర్ స్వామి వ్యాఖ్యలు చేశారని .. తక్షణం ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

More News

బిబిసి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో జీ5 నిర్మిస్తున్న  ‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌  మోషన్ పోస్టర్‌ విడుదల

ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్‌  వెబ్‌ సిరీస్‌లతో వీక్షకుల మనసులు దోచుకుంటోంది Zee5.

చరిత్రను మార్చి రాస్తా..ఆకట్టుకుంటున్న "బిచ్చగాడు 2" థీమ్ సాంగ్

విజయ్ ఆంటోనీని స్టార్ హీరోగా మార్చిన సినిమా బిచ్చగాడు.  ఈ చిత్రానికి ప్రస్తుతం బిచ్చగాడు 2 పేరుతో  సీక్వెల్ రూపొందుతోంది.

వృద్ధులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఆర్టీసీలో 60 ఏళ్లు దాటిన వారికి డిస్కౌంట్ : పేర్ని నాని ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ దృష్ట్యా 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆర్టీసీ నిలిపివేసిన 25 శాతం రాయితీని పునరుద్ధరిస్తున్నట్టు మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా భగవంత్ మన్ ప్రమాణ స్వీకారం.. పసుపు వర్ణమైన ఖట్కర్ కలన్

పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా భగవంత్‌ మన్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.

బెల్లంకొండ సురేష్.. శరణ్‌ల వివాదానికి శుభంకార్డ్: కేసు వాపసు, ఆపై క్షమాపణలు

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌, ఆయన తనయుడు సాయిశ్రీనివాస్‌కు ఫైనాన్షియర్‌ శరణ్ కుమార్‌ క్షమాపణలు తెలిపారు.