విజయశాంతి ఇంట్లో దొంగలుపడ్డారు..

  • IndiaGlitz, [Saturday,June 18 2016]

ప్ర‌ముఖ సినీ న‌టి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి హైద‌రాబాద్ బంజారా హిల్స్ లో నివాసం ఉంటున్నారు. త‌న ఇంట్లో దొంగ‌త‌నం జ‌రిగింద‌ని బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేసారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించార‌ని స‌మాచారం. డైమండ్ రింగ్, చెవి దుద్దులుతో పాటు బంగారు ఆభ‌ర‌ణాలు అప‌హ‌ర‌ణ‌కు గుర‌య్యాయి. దీంతో విజ‌య‌శాంతి సోద‌రుడు ప్ర‌సాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. అయితే ఇంట్లో ప‌ని చేసే వ్య‌క్తులే ఈ దొంగ‌త‌నానికి పాల్ప‌డి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. ఈ సంఘ‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.