చిరు సినిమాలో బన్ని భామ....

  • IndiaGlitz, [Friday,July 08 2016]

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ చిత్రం క‌త్తి రీమేక్ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు నెటివిటీకి త‌గిన విధంగా మార్పులు చేర్పులు చేశారు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. అయితే సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌యం ఇకా కొలిక్కి రాలేదు. బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు కూడా ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చాయి.
అయితే ఏవో కార‌ణాల‌తో వారు సినిమాలో చేయ‌లేమ‌ని చెప్పేస్తున్నార‌ట‌. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రంలో క్యాథ‌రిన్ థెస్రాను హీరోయిన్‌గా తీసుకోవాల‌ని యూనిట్ భావిస్తుంద‌ట‌. ఆమెతో ప్ర‌స్తుతం సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ని టాక్ విన‌ప‌డుతుంది. రీసెంట్‌గా స‌రైనోడు చిత్రంలో న‌టించిన క్యాథరిన్‌కు ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఏర్ప‌డింద‌నే చెప్పాలి. గోపీచంద్, సంప‌త్ నంది మూవీలోహీరోయిన్‌గా కూడా క్యాథ‌రిన్ పేరునే పరిశీలిస్తున్నారు. ఇప్పుడు చిరు స‌ర‌స‌న కూడా క్యాథ‌రిన్ పేరును ప‌రిశీల‌న‌లో ఉంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల సమాచారం.

More News

ప్ర‌భాస్ న్యూమూవీ టైటిల్ ఇదా..

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో మిర్చి చిత్రాన్ని నిర్మించిన యు.వి. క్రియేష‌న్స్ సంస్థ ప్ర‌భాస్ తో రెండు చిత్రాల‌ను నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తుంది. ఇందులో ఒక చిత్రానికి ర‌న్ రాజా ర‌న్ డైరెక్ట‌ర్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ద్ద నిరాహార దీక్ష చేస్తున్న హీరో..

హైద‌రాబాద్ ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ద్ద నిరాహార దీక్ష చేస్తున్న హీరో ఎవ‌రునుకుంటున్నారా..?  లాహిరి లాహిరి లాహిరిలో..., ధ‌న‌ల‌క్ష్మి ఐ ల‌వ్ యు త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన ఆదిత్యా ఓం.

నిఖిల్ మూవీతో క‌న్న‌డ‌లో ఎంట్రీ ఇస్తున్న ఆది..

డైలాగ్ కింగ్ సాయికుమార్ త‌న‌యుడు ఆది ప్రేమ‌కావాలి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే యూత్ లో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్నారు.

ఫ‌స్ట్‌డే 1.26 కొట్ల గ్రాస్ వసూలుచేసిన‌ రష్మి గౌత‌మ్‌ 'అంతం'

'గుంటూరు టాకీస్ త‌రువాత  రంజాన్ ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా ర‌ష్మిగౌతమ్ హీరోయిన్ గా విడుద‌ల‌యిన చిత్రం 'అంతం'. ద‌ర్శ‌క‌ నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ అతిత‌క్కువ‌ బ‌డ్జెట్ లో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించారు.

సురేష్ బాబు చేతుల మీదుగా పెళ్ళి చూపులు ఆడియో విడుదల

విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పెళ్లి చూపులు. ధర్మపథ క్రియేషన్స్‌, బిగ్‌ బెన్‌ స్టూడియోస్‌, వినూత్న‌ గీత బ్యానర్స్ పై రాజ్ కందుకూరి, యస్ రాగినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.