గుజరాత్ తీరంలో 11 పాక్ పడవల కలకలం.. బీఎస్ఎఫ్, వాయుసేన సెర్చ్ ఆపరేషన్

  • IndiaGlitz, [Friday,February 11 2022]

గుజరాత్‌లోని అరేబియా తీరంలో పాకిస్తాన్‌కు చెందిన 11 పడవలు భారత జలాల్లోకి ప్రవేశించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్ అప్రమత్తమైంది. హరామీ నాలా వద్ద సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం ఒక డ్రోన్‌ ద్వారా ఆ ప్రాంతంలో తనిఖీలు చేయగా.. పాకిస్థాన్‌‌కు చెందిన 11 పడవలను గుర్తించారు. దీంతో ఈ పడవల్లో పాక్‌ నుంచి భారత్‌లోకి ఎవరైనా ప్రవేశించారా.. అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఆ ప్రాంతంలో మరిన్ని పడవలు దొరికే అవకాశం ఉందనే ఉద్దేశంతో బీఎస్ఎఫ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

రాణ్‌ ఆఫ్‌ కచ్‌ ప్రాంతంలో పాక్ జాతీయులు నక్కి ఉండే అవకాశం ఉంటారన్న ఉద్దేశంతో నిన్న వాయుసేనకు చెందిన మూడు కమాండో బృందాలు రంగంలోకి దిగాయి. చిత్తడి నేలలు, మడ అడవులు, సముద్రపు ఆటు-పోట్లు కారణంగా సెర్చ్‌ ఆపరేషన్‌‌కు అవరోధాలు ఎదురవుతున్నట్లు సైన్యం చెప్పింది.

1965 యుద్ధానికి ముందు ఈ ప్రదేశంలో ఒక సైనిక ఘర్షణ జరిగింది. అనంతరం ఇరు దేశాల మధ్య రాజీ కోసం ఒక ట్రైబ్యూనల్‌ను ఏర్పాటు చేయగా.. 1968లో అది తీర్పును వెలువరించింది. పాక్‌ తనదిగా చెప్పుకొంటున్న భూభాగంలో కేవలం 10శాతం మాత్రమే దానికి దక్కింది. భౌగోళికంగా ఇది అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతం. అంతేకాదు.. ఈ ప్రదేశంలో అపారమైన మత్స్య సంపద ఉంది. ఆసియాలో చేపల వేట జరిగే అతిపెద్ద ప్రదేశాల్లో సర్‌ క్రీక్‌ కూడా ఒకటి. ఇక్కడ భారీగా చమురు నిక్షేపాలు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా నిపుణులు భావిస్తున్నారు.

More News

ఈడీ లేఖతో కలకలం... మళ్లీ తెరపైకి టాలీవుడ్‌కు డ్రగ్స్‌ కేసు, ఈసారి డొంక కదలేనా..?

కొన్నేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.

టాలీవుడ్‌కు శుభవార్త .. ఏపీలో అందుబాటులోకి కొత్త టికెట్ ధరలు, త్వరలోనే జీవో

గడిచిన కొన్ని నెలలుగా టాలీవుడ్‌కు - ఏపీ ప్రభుత్వానికి మధ్య నలుగుతున్న టికెట్ ధరల పెంపు, థియేటర్‌ల సమస్యలకు చెక్ పెట్టేందుకు సినీ ప్రముఖులు కీలక ముందడుగు వేశారు.

మీ భరోసాతో ఉత్సాహంగా ముందుకెళ్తాం: జగన్‌కు థ్యాంక్స్ చెబుతూ చిరంజీవి ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.

నెమ్మదిగా వచ్చేయండి.. విశాఖలోనూ జూబ్లీహిల్స్ క్రియేట్ చేద్దాం, టాలీవుడ్‌కు జగన్ వరాలు

టాలీవుడ్ ప్రముఖులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

లగడపాటి విక్రమ్ సహిదేవ్ డెబ్యూ మూవీ "వర్జిన్ స్టోరి" నుంచి బ్రోకెన్ లవ్ సాంగ్ విడుదల, ఈ నెల 18న సినిమా రిలీజ్

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా "వర్జిన్ స్టోరి".