MLC Kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలుకు ఫ్రాక్చర్.. మూడు వారాల పాటు రెస్ట్

  • IndiaGlitz, [Tuesday,April 11 2023]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గాయపడ్డారు. తన కాలుకు ఫ్రాక్చర్ అయినట్లుగా కవిత స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని.. నేరుగా కలవలేనివారు సోషల్ మీడియా ద్వారా తనను సంప్రదించవచ్చని కవిత పేర్కొన్నారు. అయితే తాను ఎలా గాయపడ్డానన్న విషయాన్ని మాత్రం కవిత వెల్లడించలేదు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఎదుట హాజరైన కవిత:

ఇదిలావుండగా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో ఆమె మూడు సార్లు విచారణకు కూడా హాజరయ్యారు. తొలుత మార్చి 11న ఆ తర్వాత మార్చి 16న అనంతరం మార్చి 20న కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరై పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ సమయంలో ధ్వంసమైనట్లుగా ఈడీ ఆరోపించిన తన ఫోన్‌లను మీడియాకు చూపించి సంచలనం సృష్టించారు.

కాలి నొప్పితో బాధపడుతున్న జగన్ :

ఇకపోతే.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు కూడా కొద్దిరోజుల క్రితం కాలికి గాయమైన సంగతి తెలిసిందే. ఉదయం పూట వ్యాయామం చేస్తుండగా సీఎం కాలు బెణికింది. డాక్టర్ల సూచన మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అంతేకాదు సీఎం హోదాలో ఒంటిమిట్ట ఆలయానికి వెళ్లాల్సిన పర్యటనను కూడా ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నారు. గతంలోనూ ఇలాగే గాయంతో ఇబ్బందిపడ్డ జగన్.. తర్వాత కోలుకున్నారు. అయితే మరోసారి ఆయనకు గాయం తిరగబెట్టింది.

More News

Vande Bharat:తెలుగు రాష్ట్రాలకు ముచ్చటగా మూడో వందే భారత్.. సికింద్రాబాద్ నుంచే, రూట్ ఫిక్స్

దేశ ప్రజలకు వేగవంతమైన , సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది.

BRS Party:సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీలకు ఈసీ షాక్ : 'జాతీయ' పార్టీగా ఆప్.. బీఆర్ఎస్‌కు ఏపీలో గుర్తింపు రద్దు

మరికొద్దినెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ.. ప్రస్తుతం జాతీయ పార్టీలుగా వెలుగొందుతున్న తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల సంఘం షాకిచ్చింది.

Allu Arjun:సినీ జనాలకు షాకిచ్చిన అల్లు అర్జున్ : షారుఖ్ ‘‘జవాన్’’లో కీ రోల్‌.. సైలెంట్‌గా షూట్ పూర్తిచేశాడట..?

బాహుబలి సిరీస్ , పుష్ప, ఆర్ఆర్ఆర్ , కార్తీకేయ తదితర సినిమాలు బ్లాక్‌బస్టర్‌లు కావడం.

Natti Kumar :కొందరికి తెలియదు, కొందరినీ పిలవలేదు.. ఆస్కార్ విజేతలను ఇలాగేనా గౌరవించేది : నట్టి కుమార్ ఆరోపణలు

తెలుగు చిత్ర సీమ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది ఆర్ఆర్ఆర్. టాలీవుడ్‌ కలలో కూడా ఊహించని ఆస్కార్ అవార్డ్‌ని ముద్దాడి దేశానికి కానుక ఇచ్చారు ఎస్ఎస్ రాజమౌళి.

Radhika Apte : హీరోల రెమ్యూనరేషన్‌పై రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు

రాధికా ఆప్టే.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు.