BRS MLAs: మధురై కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రీజన్ ఇదే..

  • IndiaGlitz, [Wednesday,January 10 2024]

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి తమిళనాడులోని మధురై కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం వీరు కోర్టులో కూర్చుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా మాణిక్కం ఠాగూర్ ఉన్న సమయంలో టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. అయితే రేవంత్ నియామకం కోసం మాణిక్కం ఠాగూర్ రూ.500కోట్లు తీసుకున్నారని కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన ఆయన.. మధురై కోర్టులో వారిపై పరువునష్టం దావా దాఖలు చేశారు. దీనిపై విచారణకు హాజరు కావాలని కోర్టు చాలా సార్లు సమన్లు జారీ చేయగా.. వారు హాజరుకాలేదు. దీంతో వారిద్దరికి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. దీంతో ఇరువురు న్యాయమూర్తి ముందు హాజరైనట్లు తెలుస్తోంది. అనంతరం నాన్‌బెయిల్‌బుల్ వారెంట్‌ను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తాజాగా దీనిపై ఠాగూర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ మాపై వచ్చిన ప్రతి ఆరోపణపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వారు నాపై చేసిన తప్పుడు ఆరోపణలపై స్పందిస్తూ మధురై కోర్టులో పరువు నష్టం కేసు వేశాను. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి ఇద్దరూ మదురై కోర్టుకు హాజరుకాగా.. న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది” అంటూ తెలిపారు.

అయితే ఠాగూర్ ట్వీట్‌పై కౌశిక్ రెడ్డి కౌంటర్ ట్వీట్ చేశారు. మాణిక్కం ఠాగూర్ జీ.. ఈ ఆరోపణలు సొం స్వంత కాంగ్రెస్ పార్టీ నేతలు చేసారు.. మేము దానిని సమర్థించాము.. అయితే న్యాయం గెలుస్తుందని చింతించకండి. ఇది సమయం మాత్రమే అంటూ పేర్కొన్నారు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.

More News

YSRCP: వైసీపీకి వరుస షాక్‌లు.. మరో నేత గుడ్ బై!

ఎన్నికల వేళ అధికార వైసీపీకి ఊహించని షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. టికెట్ రాని నేతలతో పాటు పార్టీలో ప్రాధాన్యత దక్కని వారందరూ పార్టీని వీడుతున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు

TSPSC చైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న TSPSC చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం

Ambati Rayudu: జనసేనలోకి అంబటి రాయుడు.. పవన్ కల్యాణ్‌తో భేటీ..

ఏపీ రాజకీయాలు ఏ క్షణం ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఊహించడం కష్టమౌతోంది. ఎవరూ ఎప్పుడూ ఏ పార్టీలో చేరతారో అర్థం కావడం లేదు. తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు

Chandrababu: బ్రేకింగ్: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట

ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్, ఇసుక కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.

Mahesh Babu: థ్యాంక్యూ మై హోమ్‌టౌన్ గుంటూరు.. మహేష్ ఎమోషనల్ పోస్ట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న 'గుంటూరు కారం' సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది.