లగడపాటి విక్రమ్ సహిదేవ్ డెబ్యూ మూవీ "వర్జిన్ స్టోరి" నుంచి బ్రోకెన్ లవ్ సాంగ్ విడుదల, ఈ నెల 18న సినిమా రిలీజ్

  • IndiaGlitz, [Thursday,February 10 2022]

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా వర్జిన్ స్టోరి. కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక. ఈ యంగ్ టాలెంట్ వర్జిన్ స్టోరి చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించారు. వర్జిన్ స్టోరి సినిమా ఈ నెల 18న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా ఈ చిత్రంలోని బ్రోకెన్ లవ్ పాటను విడుదల చేశారు.

అచ్చు రాజమణి సంగీతాన్ని అందించిన బ్రోకెన్ లవ్ పాటకు అనంతశ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా హారికా నారాయణ్ పాడారు. ప్రేమికుడు దూరమైన సందర్భంలో నాయిక పాడుకునే సాడ్ సాంగ్ ఇది. ఏమో ఏమో అనుకోవడం, ఏదో ఏదో అయిపోవడం, ఏమో ఏమో ఏం చేయడం, ఎన్నో ప్రశ్నలైందే ఒక జీవితం. అంటూ సాగుతుందీ పాట.

మ్యూజిక్ పరంగా వర్జిన్ స్టోరి మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. ఇప్పటిదాకా విడుదలైన పాటలు 'మనసా నిన్నలా', 'కొత్తగా రెక్కలొచ్చెనా', 'బేబీ ఐయామ్ ఇన్ లవ్' ఛాట్ బస్టర్స్ అయ్యాయి. తాజాగా బ్రోకెన్ లవ్ కూడా యూత్ కు బాగా రీచ్ అయ్యేలా ఉంది. టీజర్ , ట్రైలర్ తో పాటు ఈ ఛాట్ బస్టర్ సాంగ్స్ సినిమాపై క్రేజ్ పెంచుతున్నాయి.

More News

జ‌గ‌న్‌తో ముగిసిన భేటీ.. చిరంజీవికి థ్యాంక్స్, త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు: మ‌హేశ్ బాబు

సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ..

సీఎం పర్యటన.. విశాఖలో జనానికి ‘‘ట్రాఫిక్’’ కష్టాలు.. పోలీసులపై జగన్ ఆగ్రహం

బుధవారం విశాఖలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

ఎర్రబుగ్గ కార్ల వాడకం... తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

రోడ్డుపై ఎర్రబుగ్గ కార్లలో ప్రయాణించాలని చాలా మంది కల. ఇందుకోసం ఎంతో కష్టపడి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లుగా, రాజకీయ నాయకులుగా మారి తమ లక్ష్యాన్ని అందుకుంటారు.

జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ: బెజవాడ చేరుకున్న చిరంజీవి, మహేశ్, ప్రభాస్.. నాగ్, ఎన్టీఆర్ మిస్

సినీ పరిశ్రమ సమస్యలపై సీఎం జగన్‌తో చర్చించేందుకు గాను టాలీవుడ్ ప్రముఖుల బృందం విజయవాడ చేరుకుంది.

పవన్ సంచలన నిర్ణయం.. త్వరలో రెండు రాష్ట్రాల్లో నారసింహ యాత్ర

రాజకీయంగా యాక్టీవ్ అవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో యాత్ర చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారు.