బ్ర‌హ్మోత్స‌వం ఊటీ షెడ్యూల్ మారిందా..?

  • IndiaGlitz, [Wednesday,October 14 2015]

సూప‌ర్ స్టార్ మ‌హేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్ లో రూపొందుతున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణిత న‌టిస్తున్నారు. తెలుగు, త‌మిళ్ లో బ్ర‌హ్మోత్స‌వం చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మిస్తోంది. న‌వంబ‌ర్ మొద‌టి వారంలో బ్ర‌హ్మోత్స‌వం తాజా షెడ్యూల్ ను ఊటీలో ప్లాన్ చేసారు. వారం రోజులు పాటు జ‌రిగే ఊటీ షెడ్యూల్ లో కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాల‌నుకున్నారు.

అయితే ఈ షెడ్యూల్ లో స‌హ‌జ న‌టి జ‌య‌సుధ పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాలి. అయితే న‌వంబ‌ర్ లో అదీ ఊటీలో చ‌లి ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక‌ జ‌య‌సుధ ఆరోగ్య కార‌ణాల వ‌ల‌న ఊటీ రాలేన‌ని చెప్పార‌ట‌. అంద‌చేత బ్ర‌హ్మోత్స‌వం తాజా షెడ్యూల్ ను ఊటీకి బ‌దులు అర‌కులో ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంద‌ని ఆలోచిస్తున్నార‌ట‌. అదీ సంగ‌తి.