'పంచతంత్రం'లో కథా బ్రహ్మ బ్రహ్మానందం క్యారెక్టర్ టీజర్ విడుదల

  • IndiaGlitz, [Tuesday,February 01 2022]

కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం 'పంచతంత్రం'. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. ఈ రోజు (ఫిబ్రవరి 1న) బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన క్యారెక్టర్ టీజర్ విడుదల చేశారు.

'పంచతంత్రం'లో వేదవ్యాస్ పాత్రలో బ్రహ్మానందం నటిస్తున్నట్టు దర్శకులు హర్ష పులిపాక. తెలిపారు. ఆలిండియా రేడియోలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి వేదవ్యాస్. ఆయన కుమార్తె పాత్రను స్వాతి రెడ్డి చేశారు. 'జర్నీ ఆఫ్ వ్యాస్' పేరుతో విడుదల చేసిన టీజ‌ర్‌లో అరవైయేళ్ల వయసులో కథల పోటీల్లో పాల్గొనడానికి వెళ్లిన వ్యక్తిగా బ్రహ్మానందాన్ని చూపించారు. 'ఏమ్మా... కెరీర్ అంటే 20ల్లోనే మొదలు పెట్టాలా? 60ల్లో మొదలు పెట్టకూడదా?' అని బ్రహ్మానందం చెప్పే డైలాగ్ చాలామందికి కనెక్ట్ అయ్యేలా ఉంది.

నిర్మాతలు సృజన్‌ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ బ్రహ్మానందం గారు ఎన్నో పాత్రల్లో మనల్ని నవ్వించారు. ఆయనలో వినోదం మాటున అద్భుతమైన నటుడు ఉన్నారు. మా సినిమాలో నటుడిగా ఆయన కొత్త పాత్రలో కనిపిస్తారు. వెయ్యి చిత్రాలకు పైగా చేసిన బ్రహ్మానందం గారు, మా సినిమాలో నటించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీ, ఇతర వివరాలు వెల్లడిస్తాం అని అన్నారు.

'పంచతంత్రం' రచయిత, దర్శకుడు హర్ష పులిపాక మాట్లాడుతూ నా తొలి సినిమాలో బ్రహ్మానందం గారు నటించడం ఎంతో సంతోషంగా ఉంది. వేదవ్యాస్ పాత్రలో ఆయన జీవించారు. బ్రహ్మానందం, స్వాతిరెడ్డి మధ్య సన్నివేశాలు ఎంతో హృద్యంగా ఉంటాయి. ప్రేక్షకుల్లో హృదయాల్లో బలమైన ముద్ర వేస్తాయి. సినిమా దాదాపు రెడీ అయ్యింది అని చెప్పారు.

More News

చీప్ యాక్టర్‌‌తో పోల్చొద్దంటూ పోస్ట్.. స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి

సోషల్ మీడియా వచ్చిన తర్వాత నెటిజన్లకు టార్గెట్‌గా మారుతున్నారు సెలబ్రిటీలు. చిన్న పోస్ట్ చేయడం పాపం.. అయినదానికి కానిదానికి వాళ్లను ట్రోల్ చేస్తున్నారు.

క్రిప్టో కరెన్సీకి కళ్లెం.. ఇండియాలో అందుబాటులోకి డిజిటల్ రూపీ

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ లావాదేవీలు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పెట్టుబడులు పెట్టేవారు కూడా రోజురోజుకు విస్తరిస్తున్నారు. ఈ వ్యవహారం కేంద్రం దృష్టికి కూడా వచ్చింది.

వేతన జీవులకు నిరాశ... ట్యాక్స్ స్లాబులపై నోరు విప్పని నిర్మలా సీతారామన్

2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ పేయర్స్‌కు నిర్మలమ్మ నిరాశనే మిగిల్చారు.

ఆర్మీకి 117 ఎకరాల భూమి విరాళం.. అది అవాస్తవం, నేనేమి ఇవ్వలేదు : పుకార్లకు సుమన్ చెక్

అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకాలు మన చుట్టూ చాలా మంది వున్నారు. ఇక సోషల్ మీడియా రాకతో ఈ పిచ్చి మరింత ముదిరింది.

‘‘భీమ్లా నాయక్’’ ఆ రెండింటిలో ఏ రోజునో మరి..?

రానున్న మూడు నెలల్లో సినిమా పండగని స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు చెప్పినట్లుగానే టాలీవుడ్‌లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.