శ్రీవారిని దర్శించుకున్న బోయపాటి.. 'అఖండ' కడపలో అంట!

మాస్ ఆడియన్స్ కు మంచి కిక్కిచ్చే దర్శకుడు బోయపాటి శ్రీను. భారీ డైలాగులు, యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టడం బాలయ్యకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే బాలయ్యకు, బోయపాటికి మధ్య సింక్ అంత బాగా కుదిరింది. ఈ క్రేజీ కాంబోలో హ్యాట్రిక్ చిత్రం 'అఖండ' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: అమేజింగ్.. బికినీలో రకుల్ అందాల ట్రీట్!

ఇదిలా ఉండగా దర్శకుడు బోయపాటి బుధవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి బ్రేక్ దర్శన సమయంలో బోయపాటి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం బోయపాటి మీడియాతో మాట్లాడుతూ 'అఖండ' చిత్ర విశేషాలు పంచుకున్నారు.

క్లైమాక్స్ ఎపిసోడ్స్ చిత్రీకరణ కోసం లొకేషన్స్ వెతుకుతున్నట్లు బోయపాటి తెలిపారు. హైదరాబాద్ లో వర్షాలు పడుతుండడంతో చిత్రీకరణ కుదరడం లేదని అన్నారు. కడపలో లొకేషన్స్ చూస్తున్నట్లు బోయపాటి తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ ప్రభావాన్ని బట్టి సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అన్నారు.

అఖండ చిత్రంలో బాలయ్యకు జోడిగా ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్యన విడుదలైన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బోయపాటి తన తదుపరి చిత్రం కోసం అల్లు అర్జున్ తో సంప్రదింపులు జరుపుతున్నారు.

More News

టీడీపీకి షాక్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ని స్వాధీనం చేసుకోవాలి.. కేసీఆర్ కు లేఖ

పరిస్థితులు చూస్తుంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నామమాత్రంగానే ఉన్నట్లు అనిపిస్తోంది.

తీవ్ర విషాదం.. నటి కవిత భర్త మృతి, కొడుకు మరణించిన 15 రోజుల్లోనే..

ఒక ప్రళయంలా వచ్చి ప్రజలపై పడ్డ కరోనా వైరస్ వేలాది కుటుంబాల్లో చీకటి నింపుతోంది.

జల్సాలో పవన్.. RRR లో ఎన్టీఆర్.. దీని వెనుక ఇంత కథ ఉందా..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర విడుదల కోసం అభిమానులంతా ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అమేజింగ్.. బికినీలో రకుల్ అందాల ట్రీట్!

అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సౌత్ లో కూడా రకుల్ స్టార్ హీరోయిన్.

'సాహో' నటి భర్త హఠాన్మరణం.. కారణం ఇదే!

ప్రముఖ బాలీవుడ్ నటి, టెలివిజన్ పర్సన్ అయిన మందిరా బేడీ భర్త రాజ్ కౌశల్ మృతి చెందారు.