ఇట్స్ అఫిషీయల్: బోయపాటి శ్రీను - రామ్ కాంబినేషన్ ఫిక్స్.. టాలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా మూవీ

నందమూరి బాలకృష్ణతో తెరకెక్కించిన అఖండ సినిమా ఘన విజయం సాధించడంతో బోయపాటి శ్రీను మంచి జోష్‌లో వున్నారు. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా బాక్సాఫీస్‌కు ఆయన కళ తీసుకొచ్చారు. బాలయ్య డైలాగ్స్, ఫైట్స్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో అఖండ మంచి వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో బోయపాటితో సినిమా తీసేందుకు పలువురు స్టార్ హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. అటు బాలీవుడ్ నుంచి కూడా ఆయనకు ఆఫర్లు వస్తున్నాయి. దీంతో శ్రీను ఎవరితో కమిట్ అవుతారా అని ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపథ్యంలో ఊహాగానాకు తెరదించారు బోయపాటి శ్రీను. ఏకంగా పాన్ ఇండియా సినిమా చేయడానికి ఆయన రెడీ అయ్యారు. ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా బోయపాటి సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తొలి చిత్రమిది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి. ఆయన సినిమాలకు ఉత్తరాది ప్రేక్షకుల్లో క్రేజ్ వుంది. అటు రామ్ సినిమాలకు కూడా హిందీలో మంచి మార్కెట్ ఉంది. దీనిని దృష్టిలో వుంచుకునే బోయపాటి- రామ్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేశారు మేకర్స్.

ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామ్ హీరోగా రూపొందుతున్న 'ది వారియర్' సినిమాకు ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మించనున్నట్టు శ్రీనివాసా చిట్టూరి వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌కు ఒక ప్రత్యేకత వుంది. హీరోగా రామ్‌కు ఇది 20వ చిత్రమైతే.. దర్శకుడిగా బోయపాటి శ్రీనుకు 10వ సినిమా.

More News

కేసీఆర్‌తో నాకు గొడవలేంటీ.. అంతా మీడియా వల్లే: చినజీయర్ ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కి చిన్నజీయర్ స్వామికి  మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో

‘‘చోర్ బజార్’’ టైటిల్ సాంగ్ విడుదల చేసిన స్టైలిష్ హీరో రామ్ పోతినేని

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్  తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది.

చంద్రబాబు ఫ్యామిలీకి సొంతూరిలోనే షాక్.. భూమి ఆక్రమణకు యత్నం

భూమి విలువ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఎక్కడ భూమి కనిపించినా..

2008 అహ్మాదాబాద్ పేలుళ్ల కేసు: 38 మందికి మరణశిక్ష... న్యాయస్థానం సంచలన తీర్పు

పద్నాలుగేళ్ల నాటి అహ్మదాబాద్‌ వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది.

కూరగాయలు, పువ్వులతో కేసీఆర్ చిత్రం.. తెలంగాణ సీఎంకు కడియంలో వినూత్నంగా బర్త్ డే విషెస్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే చంద్రశేఖర్ రావుకు ఏపీలోనూ అభిమానులున్న సంగతి తెలిసిందే.