ఆ ట్రిక్ తో బోయపాటికి హ్యాట్రిక్..

  • IndiaGlitz, [Monday,August 14 2017]

లెజెండ్‌, స‌రైనోడు, తాజాగా.. జ‌య‌జాన‌కి నాయ‌క చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకున్నాడు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను. మాస్‌, ఊర మాస్‌.. ఇలాంటి ఫార్మెట్‌లోనే సినిమాలు చేసుకుపోయే బోయ‌పాటి.. ఈ మూడు చిత్రాల్లోనూ ఒకే ట్రిక్ ని కంటిన్యూ చేశాడు. అదేమిటంటే.. ఒక‌ప్ప‌టి హీరోల‌ను విల‌న్‌గా చూపించ‌డం.
లెజెండ్ సినిమాలో ఫ్యామిలీ చిత్రాల క‌థానాయ‌కుడు జ‌గ‌ప‌తిబాబుని విల‌న్‌గా మార్చేస్తే.. స‌రైనోడు చిత్రంతో యువ క‌థానాయ‌కుడు ఆది పినిశెట్టిని ప్ర‌తినాయ‌కుడుని చేసేశాడు. ఇక తాజా చిత్రం జ‌య‌జాన‌కి నాయ‌క కోసం మ‌ళ్లీ జ‌గ‌ప‌తిబాబునే విల‌న్‌గా పెట్టుకున్నాడు. అంటే మూడు వ‌రుస చిత్రాల కోసం 'ఒక‌ప్ప‌టి క‌థానాయ‌కుడునే ప్ర‌తినాయ‌కుడు గా ఎంచుకోవ‌డం' అనే ట్రిక్ ని వాడి బోయ‌పాటి హ్యాట్రిక్‌ని కొట్టాడ‌న్న‌మాట‌. బోయ‌పాటా..మ‌జాకా..!

More News

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ , వైజయంతి మూవీస్ భారీ చిత్రం ప్రారంభం

సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడుగా సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో

నిజామాబాద్ భాన్సువాడలో 'ఫిదా' సక్సెస్ సంబురాలు

ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'ఫిదా' గురించే హాట్ టాపిక్.

ఆ హీరోకి దేవిశ్రీనే లక్కీ మ్యూజిక్ డైరెక్టర్..

'భారీ చిత్రాల నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు' అనే బ్రాండ్ తో హీరోగా తెరంగేట్రం చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్.

అప్పుడు నిత్యా..ఇప్పుడు మేఘా..

ఒకే హీరోయిన్ తో రెండు వరుస సినిమాలు చేయడం నితిన్ కి సెంటిమెంట్గా మారనుందా?

తారక్ సినిమాతో హ్యాట్రిక్ కొడుతుందా?

చేసింది రెండు సినిమాలే.కానీ ఆ రెండు సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది కేరళ కుట్టి నివేదా థామస్.