'బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది' టైటిల్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Friday,August 21 2020]

కామెడీ హీరో షకలక శంకర్ లీడ్ రోల్ లో మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్ సమర్పణ లో రూపొందిన అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటెర్టైనెర్ మూవీ కి బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాతో కుమార్ కోట దర్శకునిగా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నారు. అలానే ప్రముఖ ఫిల్మ్ పి. ఆర్. ఓ ఏలూరు శ్రీను ఈ చిత్రానికి కథ, డైలాగ్స్ అందించారు. మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఫుల్ కామెడి అండ్ రొమాంటిక్ ఎంటరైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా నిర్మాతలు లుకాలపు మధు, దత్తి సురేష్ బాబు తెలిపారు.

షకలక శంకర్ నుంచి ఆడియన్స్ ఎక్సపెక్ట్ చేసే కామెడి తో పాటు మరి కొన్ని థ్రిల్ ఎలెమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నట్లుగా చెబుతున్నారు దర్శకుడు కుమారు కోట. షకలక శంకర్ తో పాటు ప్రియ, అర్జున్ కళ్యాణ్, రాజు స్వరూప్, స్వాతి తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ లుక్ తాజగా గా విడుదల అయింది. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది అనే అర్ధం లో ఎంత ఫన్ ఉందో ఫుల్ సినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది అని చిత్ర బృందం కాన్ఫిడెంట్ గా చెబుతుంది. టైటిల్ లుక్ రిలీజ్ చేసిన సందర్బంగా

దర్శకుడు కుమార్ కోట మాట్లాడుతూ... బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది డైరెక్టర్ గా నా తొలి సినిమా, ఈ సినిమాకి ఓ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ రొమాంటిక్ కమర్షియల్ స్టోరీ ని ప్రముఖ పి.ఆర్.ఓ ఏలూరు శ్రీను అందించారు. అలానే ఆయనే ఈ చిత్రానికి డైలాగ్స్ కూడా అందించారు. మా తొలి ప్రయత్నంగా ఈ సినిమాని ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో రెడీ చేసాము, షకలక శంకర్ మార్క్ కామెడీ అండ్ యాక్షన్, ఆడియన్స్ ని తప్పకుండా అలరిస్తుంది అని ఆశిస్తున్నాను.

నిర్మాతలు లుకాలపు మధు, దత్తి సురేష్ మాట్లాడుతూ.. కొత్త దర్సకుడు కుమార్ కోట, ఏలూరు శ్రీను గారు రాసిన కథను చక్కగా తెరకెక్కించాడు. సినిమా ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ ఉండే రీతిన ఏలూరు శ్రీను డైలాగ్స్ అందించారు. వీరిద్దరి టాలెంట్ తో పాటు షకలక శంకర్ యాక్షన్, కామెడీ తదితర అంశాలు ఈ చిత్రానికి హైలైట్ అవనున్నాయి అని తెలిపారు

నటీనటులు.. షకలక శంకర్ , ప్రియ

More News

ఇది శాశ్వతం కాదు. తాత్కాలిక కష్టమే.. ప్లీజ్.. ప్లీజ్: చిరంజీవి

ఏవో చిన్నాచితకా సినిమాలు తప్ప పెద్దగా షూటింగ్స్ ఏమీ మొదలు కాలేదు. దీంతో సినీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ పేలుళ్లు

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో పేలుళ్లు సంభవించాయి.

సుశాంత్ మృతితో అండర్ వరల్డ్‌కు సంబంధాలున్నాయి: మాజీ ‘రా’ అధికారి

బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతిపై మాజీ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో లక్షకు చేరువలో కేసులు.. నేడు ఎన్నంటే..

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది.

కరోనా కాదు.. కుల క్వారంటైన్ సెంటర్లు.. ఏపీలో నయా ట్రెండ్..

కరోనా సమయంలో.. అసలే ఎవరినీ అంటీ ముట్టకూడదంటే.. కులంగాని కులం వారితో కలిసుండాల్సిన దుస్థితి ఏంటి అనుకున్నారో ఏమోగానీ నయా ట్రెండ్‌కి తెరదీశారు.