బన్నీ సినిమాలో బాలీవుడ్ విలన్

  • IndiaGlitz, [Saturday,April 11 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘పుష్ప’. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. బన్నీకి గత చిత్రం ఇచ్చిన కాన్ఫిడెన్సో లేక సుకుమార్ చెప్పిన కథపై నమ్మకమో ఏమో కానీ ఈసారి ఏకంగా పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పుష్ప చిత్రం తెలుగుతో పాటు మలయాళం, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. తెలుగు, మలయాళంలో అల్లు అర్జున్‌కి కావాల్సినంత క్రేజ్ ఉండ‌టంతో ఇబ్బంది లేదు. కానీ హిందీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి బ‌న్నీ ప‌క్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడ‌ట‌. ప్ర‌ధాన పాత్ర‌ల్లో వీలైనంత మంది బాలీవుడ్ న‌టీన‌టుల‌ను న‌టింప చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌.

ఇప్ప‌టికే ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్ కోసం కియారా అద్వానీని సంప్ర‌దిస్తున్నార‌నే వార్త‌లు విన‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. కాగా.. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో విల‌న్‌గా బాలీవుడ్ యాక్ట‌ర్‌ను తీసుకోబోతున్నార‌ట‌. సంజ‌య్ ద‌త్‌, సునీల్ శెట్టి పేర్లు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతున్నాయి. ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి కూడా పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తుండ‌టం విశేషం. చిత్తూరు జిల్లా శేషాచ‌ల అడ‌వుల్లో జరిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్క‌నుంది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభించ‌నున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించ‌నుంది.

More News

మాట మీద నిల‌బ‌డే వ్య‌క్తి .. త‌మ‌న్‌: బ‌న్నీ

బ‌న్నీ ఆనందానికి అవ‌ధులు లేవు. ఎప్ప‌టి నుండో ఎదురు చూసిన సాలిడ్ హిట్‌ను ఈ ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో సాధించేశాడు. బ‌న్నీ,

ఫేక్ న్యూస్‌పై స్పందించిన మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి త‌ల్లి అంజ‌నా దేవి క‌రోనా వైర‌స్ పోరాటంలో భాగంగా త‌న వంతు సాయం చేస్తున్నార‌ని, అందులోభాగంగా త‌న స్నేహితుల‌తో క‌లిసి 700 మాస్కుల‌ను త‌యారు చేసి

రియ‌ల్ హీరోస్‌కు సెల్యూట్ : వెంక‌టేశ్‌

క‌రోనా మ‌హ‌మ్మారి నుండి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డంలో డాక్ట‌ర్లు, పోలీసులు, ఇత‌ర ఆరోగ్య సిబ్బంది చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. అహ‌ర్నిశ‌లు ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డుతున్నారు.

అల్లు ఫ్యామిలీ, పవన్‌తో విబేధాలపై చిరు క్లారిటీ

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఉన్నా.. రాజకీయాల్లో ఉన్నా.. పెద్ద ఎత్తున వార్తలు నిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆయన ఫ్యామిలీ విషయాల్లో ఎక్కువగా పుకార్లు షికార్లు చేస్తుంటాయ్.

త్రిష ఒకలా.. మెగాస్టార్ మరోలా.. అసలేం జరిగింది!?

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్‌లో ‘ఆచార్య’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ లేకపోయుంటే ఈ పాటికే సుమారు సగానికి పైగా సినిమా పూర్తయ్యేది.