ప్రభాస్ కోసం ఆ బాలీవుడ్ స్టార్ దిగుతున్నాడా..?

  • IndiaGlitz, [Thursday,January 07 2021]

ప్ర‌భాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన త‌ర్వాత ఆయ‌న కోసం ద‌ర్శ‌క నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే నాలుగు ప్యాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేశాడు ప్ర‌భాస్‌. అందులో ముందుగా రాధేశ్యామ్ విడుద‌ల‌కు సన్న‌ద్ధ‌మవుతోంది. దీని తర్వాత ప్రభాస్ సలార్ మూవీ కోసం రెడీ అవుతాడు. ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌లో విజ‌య్ క‌ర‌గందూర్ ‘సలార్’ అనే ప్యాన్ ఇండియా మూవీని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా ఓం రావుత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాతో పాటు, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయాల్సి ఉంది. ఇన్ని సినిమాలు ఉండగా ప్రభాస్ ‘సలార్’ సినిమాను ట్రాక్‌లోకి తెస్తున్నాడు. జనవరి 18 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ రేంజ్ ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్‌కు ఎద‌గ‌డం.. భారీ రెమ్యున‌రేష‌న్స్ కార‌ణంగా జాన్ అబ్ర‌హం కూడా విల‌న్‌గా న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని టాక్ వినిపిస్తోంది. ప్ర‌భాస్‌ నాలుగు నెలల పాటు ‘సలార్’ కోసం డేట్స్‌ను కేటాయించాడట. మే చివరి నాటికంతా ‘సలార్’ షూటింగ్‌ను పూర్తి చేసేలా యూనిట్ ప్లాన్ చేసిందట. అలాగే ఇందులో దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ వార్తలకు సంబంధించి మరింత క్లారిటీ రానుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

More News

ర‌కుల్ ఆ స్టార్‌ను బుట్ట‌లో వేసుకుందా?

తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది రకుల్‌ ప్రీత్‌ సింగ్.

మంత్రి సబిత కుమారుడి పేరుతో తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసం..

తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మూడో కుమారుడైన కళ్యాణ్ రెడ్డి పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఆదిలాబాద్ టౌన్‌కి చెందిన ప్రవీణ్ కుమార్

మొదటి మహిళ హైకోర్టు సీజేగా హిమా కోహ్లీ ప్రమాణం..

తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా హిమా కోహ్లీ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీతో గవర్నర్ తమిళ సై ప్రమాణ స్వీకారం చేయించారు.

రాముడిగా ప్రభాస్‌నే ఊహించుకున్నా: డైరెక్టర్ ఓం రౌత్

‘బాహుబలి’ సినిమా తరువాతి నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా మూవీలపైనే ఎంచుకుంటున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్‌లో కిడ్నాప్.. అఖిలప్రియ అరెస్ట్.. అసలేం జరిగిందంటే..

హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల కిడ్నాప్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే.