మ‌హాన‌టి పాత్ర‌లో బాలీవుడ్ తారలా..?

  • IndiaGlitz, [Thursday,June 23 2016]

ఇటు ప్రేక్షకులు, విమర్శకులతో ఎవడే సుబ్రమణ్యం' వంటి డిఫరెంట్ చిత్రాన్ని తీసి మెప్పు పొందిన దర్శకుడు నాగ అశ్విన్. ఇప్పుడు తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి మహానటిగా తనకంటూ ఓ అధ్యాయాన్ని క్రియేట్ చేసుకున్న మహానటి సావిత్రికి పై బయోపిక్ ను తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం.

80 వ దశకంలో తనదైన నటనతో ప్రేక్షకులను రంజింప చేసిన సావిత్రి జీవిత చరిత్రను సినిమాగా తీయడం అంటే మాటలు కాదు, సావిత్రి పాత్ర‌ను పోషించ‌డానికి స‌రిపోయే న‌టి ఎవ‌రా అని చ‌ర్చ మొద‌లైంది. అయితే నిర్మాత‌లు ఈ సినిమాను తెలుగు, త‌మిళంతో పాటు హిందీలో కూడా తీసుకెళ్లాల‌ని భావిస్తున్నార‌ట‌. అందుక‌ని బాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్స్ అయితే సినిమాకు మంచి క్రేజ్ వ‌స్తుంద‌ని భావిస్తున్నార‌ట‌. టైటిల్ పాత్రలో ప్రియాంక చోప్రా లేదా దీపికా పదుకొనేను కానీ తీసుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. మ‌రి దర్శ‌క నిర్మాత‌ల‌ స‌న్నాహాలు ఎంత వ‌ర‌కు స‌ఫ‌ల‌మ‌వుతాయో చూడాలి. ఈ చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్వ‌నీద‌త్ నిర్మిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

శ్రియ త‌న‌యుడిగా నారారోహిత్‌...?

సినిమాల్లో ఏదైనా సాధ్య‌మే అసాధ్యాన్ని సుసాధ్యం చేసేస్తారు, సుసాధ్యాన్ని అసాధ్యంగా చూపిస్తారు. ఒకే వ‌య‌సున్న వారిని తండ్రికొడుకులుగా, త‌ల్లికొడుకులుగా ఇలా ఏలాగైనా చూపించ‌డం సినిమాల్లోనే సాధ్యం. ఇప్పుడు అలాంటి వార్త ఒక‌టి ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది.

'జ‌న‌తాగ్యారేజ్' టీజ‌ర్ డేట్‌

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కొర‌టాల శివ‌ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘జ‌న‌తాగ్యారేజ్‌’. ప్ర‌స్తుతం సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. సినిమాను ఆగ‌స్టు 12న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

త‌న మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేసిన నాగార్జున‌

అక్కినేని నాగార్జున, ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్రరావు కాంబినేష‌న్‌లోమ‌రో భ‌క్తిర‌స చిత్రం రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది.

'బాహుబ‌లి2'కి నాని డైరెక్ష‌న్‌..

రీసెంట్‌గా విడుద‌లైన ‘జెంటిల్‌మ‌న్’ చిత్రంతో మ‌రో స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్న హీరో నాని ఇప్పుడు విరించివ‌ర్మ, జెమిని  కిర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రంలో న‌టిస్తున్నాడు.

హిట్ ద‌ర్శ‌కుడితో నిఖిల్‌

హ్య‌పీడేస్‌తో తెరంగేట్రం చేసిన హీరో నిఖిల్ త‌ర్వాత యువ‌త చిత్రంతో కూడా మంచి స‌క్ససే అందుకున్నాడు. అయితే త‌ర్వాత అన్నీ ప్లాప్ చిత్రాల్లో భాగ‌మ‌య్యాడు.