బాలీవుడ్ న‌టుడు,ద‌ర్శ‌కుడు నీరజ్ వోరా క‌న్న‌మూత‌..

  • IndiaGlitz, [Thursday,December 14 2017]

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు, ద‌ర్శ‌కుడు నీర‌జ్ వోరా ఈరోజు ఉద‌యం నాలుగు గంట‌ల‌కు క‌న్నుమూశారు. ర‌న్ బోలా ర‌న్‌, హేరా ఫేరీ, ఫిర్ హేరా ఫేరీ, ఖిలాడి 420 వంటి చిత్రాల‌కు ద‌ర్శ‌కత్వం వ‌హించిన నీర‌జ్ వోరా..వెల్‌క‌మ్ బ్యాక్‌, బోల్ బ‌చ్చ‌న్, డిపార్ట్‌మెంట్ స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించారు. 2016లో గుండె నొప్పి రావ‌డంతో..బ్రెయిన్ స్టోక్ వ‌చ్చి కోమాలోకి వెళ్లిపోయారు నీరజ్.

ఆ స‌మ‌యంలో నీర‌జ్ స్నేహితుడు న‌దియావాలా త‌న‌ని ఇంట్లో ఉంచుకుని చికిత్స చేయించారు. వారం రోజులుగా ఆరోగ్యం క్షీణించ‌డంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. నీర‌జ్ వోరా మృతి ప‌ట్ల సినీ ప‌రిశ్ర‌మ సంతాపం తెలిపింది.

More News

వ‌ర్మ తెలుగు వెబ్ సిరీస్ 'క‌డ‌ప‌'

రామ్‌గోపాల్ వ‌ర్మ మ‌రో సంచ‌ల‌నానికి నాంది పలికారు. మాఫియా క‌థ‌లు, బ‌యోపిక్‌లు తీయ‌డంలో దిట్ట అయిన వ‌ర్మ ప‌రిటాల ర‌వి జీవిత చరిత్ర‌తో ర‌క్త చ‌రిత్ర సినిమా చేశారు.

'బేవ‌ర్స్' టీజ‌ర్ ని లాంచ్ చేసిన పూరి జ‌గ‌న్నాథ్‌

'ఆన‌లుగురు', 'మీ శ్రేయాభిలాషి' లాంటి గ‌ర్వించ‌ద‌గ్గ చిత్రాల్లొ న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని రెండింత‌లు సొంతం చేసుకున్న న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు ముఖ్య‌పాత్ర‌లో న‌టించిన చిత్రం బేవ‌ర్స్‌.

ఫిబ్రవరి 9న విడుదల కానున్న మోహన్ బాబు 'గాయత్రి'

విలక్షణ నటుడు డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న 'గాయత్రి' చిత్రాన్ని ఫిబ్రవరి 9 న విడుదల చేయు సన్నాహాలు చేస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో చివరి షెడ్యూల్ షూటింగ్ నేటితో పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో విష్ణు మంచు ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

ఆయ‌న‌తో సూర్య మూడోసారి..?

తెలుగు, త‌మిళంలో మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. ఈయ‌న తాజాగా నటించిన చిత్రం గ్యాంగ్ ఈ సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఈ సినిమా త‌ర్వాత సూర్య సెల్వ రాఘ‌వ‌న్ సినిమాలో న‌టించ‌బోతున్నాడు.

సూర్య డ‌బ్బింగ్ చెప్పాడా?

హీరో సూర్య 'గ్యాంగ్' సినిమాతో వ‌చ్చే సంక్రాంతికి సంద‌డి చేయ‌బోతున్నాడు. విఘ్నేశ్ శివ‌న్ ద‌ర్శ‌కుడు. త‌మిళంలో తెరకెక్కిన 'తానా సెంద కూట్ట‌మ్' సినిమాను తెలుగులో గ్యాంగ్ పేరుతో విడుద‌ల చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.