నిర్మాత‌గా మారుతున్న బాబీ...

  • IndiaGlitz, [Tuesday,March 27 2018]

'ప‌వ‌ర్‌', 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌', 'జై ల‌వ‌కుశ' చిత్రాల‌తో డైరెక్ట‌ర్‌గా త‌న స్టామినాను ప్రూవ్ చేసుకున్న ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబి). త్వ‌ర‌లోనే నిర్మాత‌గా మారుతున్నారు. స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ ద‌ర్శ‌కుడు అరుణ్ ప‌వార్ చెప్పిన పాయింట్ న‌చ్చ‌డంతో బాబి త‌నే సినిమాను నిర్మిస్తాన‌ని ముందుకు వ‌చ్చాడ‌ట.

ప్ర‌స్తుతం స్క్రిప్ట్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అవి పూర్తి కాగానే...అంతా పూర్త‌యిన త‌ర్వాత అధికారికంగా స‌మాచారం వెలువ‌డనుంది.

అలాగే డైరెక్ట‌ర్‌గా బాబి వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. అంటే ఒక‌వైపు ద‌ర్శ‌క‌త్వంతో పాటు నిర్మాత‌గా బాబీ బిజీ కానున్నాడు మ‌రి.