ఇటు చిరు.. అటు రజినీ.. దక్షిణాదిలో సినీ ప్రముఖులే టార్గెట్..

సూపర్‌స్టార్ రజినీకాంత్ కాషాయ తీర్థం తీసుకోబోతున్నారంటూ ఎప్పటి నుంచో ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఆయన ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త, ఆర్థిక వేత్త ఎస్.గురుమూర్తితో భేటీ కావడంతో ఆ ఊహాగానాలకు బలం చేకూరినట్టు అవుతోంది. రజినీ తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సొంత పార్టీ ఆలోచనను పక్కనబెట్టి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఎస్.గురుమూర్తితో రజినీకాంత్‌ భేటీ ముఖ్యంగా రాజకీయ ప్రాధాన్యంగానే జరిగిందని సమాచారం. రజినీ భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో చర్చించారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వీలైతే రజినీ బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతారు.. లేదంటే ఆ పార్టీకి తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారని ఈ భేటీతో తేలిపోయిందని స్థానికంగా చర్చ జరుగుతోంది.

కాగా.. రాజకీయాల్లో యాక్టివ్ రోల్ వద్దంటూ డాక్టర్లు తనకు సూచించారని రజినీకాంత్ చెప్పినట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో అలెర్ట్ అయిన బీజేపీ అధిష్టానం.. గురుమూర్తి ద్వారా రజినీకి ఒక ప్రతిపాదన పంపారనే టాక్ బలంగా వినబడుతోంది. వచ్చే తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా క్రియాశీలక పాత్ర పోషించాలని రజినీని గురుమూర్తి కోరినట్టు సమాచారం. ప్రస్తుతం రజినీ ఆరోగ్యం దృష్ట్యా కూడా సొంత పార్టీ పెట్టడం, అభ్యర్థుల్ని ఎంపిక చేసి వారిని బరిలోకి దింపడం ఇవన్నీ ఇప్పుడున్న పరిస్థితిలో అత్యంత కష్టమైన ప్రక్రియ. అంతేకాకుండా బీజేపీ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా రజినీ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో రజినీ బీజేపీ తరుఫున పోటీ చేసేందుకే మొగ్గు చూపుతారని తెలుస్తోంది.

దక్షిణాదిన సినీ తారలకు వల..

దక్షిణాదిన సినీ తారలకు బీజేపీ వల వేస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తమిళనాడులో కుష్బూ బీజేపీలోజాయిన్ అయిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తమిళనాడులో రజినీ, ఏపీలో చిరంజీవి రానున్న ఎన్నికల్లోగా తమ పార్టీలోకి తప్పక వస్తారన్న నమ్మకంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. మరోవైపు తెలంగాణ నుంచి విజయశాంతిని కూడా బీజేపీలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆది నుంచి బీజేపీ సినీ గ్లామర్‌కు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా దక్షిణాదిలోని తారలను తమ పార్టీలో చేర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది.

More News

ప‌వ‌న్ చిత్రంలో మ‌రో హీరోయిన్ కూడా ఖ‌రారైందా..?

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది.

`రాధేశ్యామ్` నుండి తిరిగొచ్చేసిన పూజాహెగ్డే..

`రాధేశ్యామ్` నుండి పూజా హెగ్డే తిరిగొచ్చేసిందా! అంటే అవును నిజ‌మే అనాలి.

'ఆర్ఆర్ఆర్‌`లో జ‌లియ‌న్ వాలాభాగ్‌

జలియ‌న్ వాలాభాగ్ ఘ‌ట‌న అన‌గానే ఎవ‌రికైనా స్వాతంత్ర్యానికి ముందు జ‌న‌ర‌ల్ డ‌య్య‌ర్ ప్ర‌జ‌ల‌పై అకృత్యంగా చేసిన కాల్పుల ఘ‌ట‌నే గుర్తుకు వ‌స్తుంది.

నాగ‌శౌర్య చిత్రానికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌..!

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య కొత్త చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ లిస్టులో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై

దేశ వ్యాప్తంగా 54 అసెంబ్లీ స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్..

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోలింగ్‌ నేడు ప్రారంభమైంది. 10 రాష్ట్రాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ఈ పోలింగ్ జరుగుతోంది.