బి.జె.పి తరుపున రజనీకాంత్ ప్రచారం..

  • IndiaGlitz, [Thursday,March 31 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కు త‌మిళ‌నాడులో ఎలాంటి క్రేజ్ ఉన్న‌దో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఆయ‌న అభిమానులు, స‌న్నిహితులు రాజ‌కీయాల్లోకి ర‌మ్మ‌ని ఎన్నిసార్లు పిలిచినా మౌనంగానే ఉన్నారు తప్ప ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ప్ర‌వేశించ‌లేదు. అన్ని పార్టీల నాయ‌కులు ర‌జ‌నీకాంత్ కు స‌న్నిహితులే. అందుచేత ఏ పార్టీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌లేదు...ప్ర‌చారం కూడా చేయ‌లేదు. ఈసారి త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు బి.జె.పి త‌రుపున సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌చారం చేయ‌నున్నార‌ట‌. ఈ విష‌యాన్ని బి.జె.పి అధికారికంగా ప్ర‌క‌టించింది. మూడు ప్ర‌ధాన వేదిక నుంచి ప్ర‌సింగించేలా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పి.ముర‌ళీథ‌ర‌రావు ర‌జ‌నీకాంత్ ని ఒప్పించార‌ట‌. వివిధ పీఠాధిప‌తులు, స్వాములు ప్ర‌చారంలో పాల్గొంటున్న‌ట్టు తెలియ‌చేసారు.
గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ర‌జ‌నీకాంత్ కు పార్టీ తీర్ధం ఇప్పించాల‌ని బి.జె.పి ప్ర‌య‌త్నించింది. కానీ కుద‌ర‌లేదు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ చెన్నై వెళ్లిన‌ప్పుడు ర‌జ‌నీకాంత్ ని ఇంటికి వెళ్లి క‌లిసారు. అది స్నేహ‌పూర్వ‌క భేటియే అని ర‌జ‌నీకాంత్ చెప్పారు. కానీ..ఇప్పుడు బి.జె.పి త‌రుపున ప్ర‌చారం చేయ‌నున్నారు. మ‌రి...ర‌జ‌నీకాంత్ బి.జె.పి కి ప్ర‌చారం చేస్తే...త‌మిళ‌నాడులో మిగిలిన పార్టీల ప‌రిస్థితి ఏమిటి అనేది ఆస‌క్తిగా మారింది. ర‌జ‌నీ ప్ర‌చారం త‌మిళ‌నాడు ఓట‌ర్ల పై ఎంత వ‌ర‌కు ప్ర‌భావితం చూపిస్తుందో..? ఎవ‌ర్ని సి.ఎం కుర్చీ పై కూర్చోబెడుతుందో..?

More News

ఊపిరి కి ఇన్ ట‌చ్ బుల్స్ నిర్మాత అభినంద‌న‌

నాగార్జున - కార్తీ - త‌మ‌న్నా క‌లిసి న‌టించిన ఊపిరి చిత్రం ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టిస్తుందో తెలిసిందే. రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ తో బ్లాక్ బ‌ష్ట‌ర్ దిశ‌గా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఊపిరి సినిమా ఇన్ ట‌చ్ బుల్స్ అనే ఫ్రెంచ్ మూవీకి అఫిషియ‌ల్ రీమేక్ అనే విష‌యం తెలిసిందే.

మంచు సోదరులిద్దరికీ కీలకమే

మోహన్ బాబు నటవారసులుగా పరిచయమైనా..తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న ప్రయత్నం చేస్తున్నారు మంచు సోదరులు విష్ణు,మనోజ్.

తమన్నా, ప్రభుదేవా కాంబినేషన్‌లో 70 కోట్ల భారీ బడ్జెట్‌తో మూడు భాషల్లో 'అభినేత్రి'

70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తుండగా, ప్రభుķ

గుమ్మడికాయ కొట్టుకున్న 'బంతిపూల జానకి'

కొబ్బరికాయ కొట్టడంతో సినిమా షూటింగ్ ప్రారంభించి.. షూటింగ్ చివరి రోజు గుమ్మడికాయ కొట్టడం అన్నది  చిత్ర పరిశ్రమలో ఆనవాయితీ అన్న విషయం తెలిసిందే.

'ఊపిరి' మాలో నమ్మకాన్ని మరింత పెంచింది - నాగార్జున

టాలీవుడ్ కింగ్ నాగార్జున,‘ఆవారా’కార్తీ,మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్ లో రూపొందిన చిత్రం'ఊపిరి'.