Maruti Kiran:సామాన్య కార్యకర్త నుంచి పీఎం స్థాయికి ఎదిగే పార్టీ బీజేపీ మాత్రమే: మారుతి కిరణ్

  • IndiaGlitz, [Friday,October 13 2023]

బీజేపీ అనేది పార్టీ కాదు కుటుంబం అని బీజేపీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ బూనేటి తెలిపారు. 1990 నుంచి ఆర్ఎస్ఎస్‌లో ఉన్నానని.. సంఘ్‌లో ఉంటూనే బీజేపీకి పనిచేస్తున్నానని చెప్పారు. మిగతా పార్టీల లాగా బీజేపీ కాదని.. వేరే పార్టీలోకి వెళ్లినా ఉండలేమన్నారు. 2020 నుంచి మాత్రమే పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్నానని.. ఈ మూడేళ్లలో రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చారన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో కూడా తనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు.

బీజేపీ అనేది పార్టీ కాదు కుటుంబం.. ఎవరికి అన్యాయం జరగదు..

బీజేపీలో ఎవరికి అన్యాయం జరగదని.. కుటుంబ పార్టీ కాదన్నారు. కేంద్ర పెద్దల నుంచి సంఘ్, రాష్ట్ర నేతలందరూ కార్యకర్తలను గమనిస్తూ ఉంటారన్నారు. ఛాయ్ అమ్మే మోదీ పీఎం స్థాయికి ఎదిగారు.. పార్టీ ఆఫీసులో ఉండే కిషన్ రెడ్డి కేంద్రమంత్రి.. కార్పొరేటర్‌ స్థాయిలో ఉండే బండి సంజయ్ ఎంపీ.. లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు సామాన్య కార్యకర్తగా ఉన్న బండారు దత్తాత్రేయ రెండు సార్లు కేంద్రమంత్రితో పాటు గవర్నర్ కూడా అయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీలో కార్యకర్తలను కుటుంబ సభ్యులు లాగా చూస్తారని.. పని విధానం నేర్పిస్తారని మారుతి కిరణ్ తెలిపారు.

బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయం..

వచ్చే ఎన్నికల్లో పరిగి అసెంబ్లీ టికెట్ తనకు ఆశిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ టికెట్ రాకపోయినా పార్టీ కోసమే పనిచేస్తానని స్పష్టంచేశారు. బీజేపీ గెలుపునకు తన వంతు కృషి చేస్తానన్నారు. బీజేపీ ఇచ్చే మేనిఫెస్టో ఎప్పుడు కూడా సాధ్యమైన హామీలను ఇస్తామన్నారు. కేంద్ర కమిటీ ఒకటికి రెండు సార్లు పరిశీలించి అట్టడుగు వర్గాలకు కూడా లబ్ధి చేకూరాలని ఆలోచిస్తామన్నారు. ఇంకా టైం ఉందని.. బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయమన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ స్కీం విధానం తీసుకువచ్చిందే బీజేపీ అన్నారు.

పరిగిలో సరైన రోడ్లు లేవు.. వీధి దీపాలు లేవు..

పరిగి అనేది అందమైన ప్రకృతితో కూడిన ప్రాంతమన్నారు. తరతరాల నుంచే సాంప్రదాయాలు పరిగిలో చూడవచ్చన్నారు. ప్రతి ప్రాంతంలో కళాకారులు ఉన్నారన్నారు. అయితే కల్మషం లేని ప్రజలు ఉన్న ప్రాంతంలో సరైన రోడ్లు లేవని.. వీధి దీపాలు లేవన్నారు. ఇటువంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. అలాగే క్యారెట్, మామిడి, సీతాఫలాలు పంటలు పండించే రైతులకు న్యాయం చేస్తానని ఆయన వెల్లడించారు.

More News

Lokesh:చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది.. ఆయనకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు: లోకేశ్

నెల రోజులుకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Bandla Ganesh:పవన్ కల్యాణ్ సమాజానికి ఉపయోగపడే వ్యక్తి.. ఆయనపై సీఎం జగన్ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: బండ్ల గణేష్

జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawankalyan) పెళ్లిళ్లపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(JaganMohan Reddy) చేసిన వ్యక్తిగత విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి

Chandrababu:టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట.. అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. పుంగనూరు అంగళ్లు కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.

Bigg Boss 7 Telugu : గాడిలో పడ్డ అమర్‌దీప్ .. రైతుబిడ్డకు మళ్లీ కెప్టెన్‌గా ఛాన్స్ , శోభను ఏడిపించిన పూజ సామెత

వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు కంటెస్టెంట్స్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో జోష్ పెరిగింది. టాస్క్‌ల్లోనూ, స్ట్రాటజీలోనూ వీరు సూపర్ అనిపించుకుంటున్నారు.

సీఎం జగన్ మానసిక స్థితి సరిగా లేకే వ్యక్తిగత విమర్శలు.. పవన్ కల్యాణ్‌కు క్షమాపణలు చెప్పాలి: నాదెండ్ల

మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు.