పునర్నవీని డేట్‌కు పిలిచిన రాహుల్.. రియాక్షన్ ఇదీ..!

  • IndiaGlitz, [Sunday,August 04 2019]

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-03 ఇప్పటి వరకూ గొడవలతో అరుపులతో ఎపిసోడ్ ముగిసిపోయేది. అయితే శుక్రవారం మాత్రం ఈ షో చూసిన వాళ్లంతా కంటతడిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా 15 మంది కంటెస్టెంట్లు వారివారి జీవితంలో జరిగిన చేదు ఘటనల గురించి చెప్పుకుంటూ కంటతడి పెట్టుకున్నారు. ఇక హౌస్‌మేట్స్‌ అందరూ ఎమోషనల్‌ అవడం.. హౌస్‌లో ఏ ఒక్క జరగడపోవడంతో శుక్రవారం ఎపిసోడ్ మాత్రం ప్రశాంతంగా.. పీస్‌ఫుల్‌గా ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సందర్భంగా ‘ఉయ్యాల జంపాల’ హీరోయిన్ పునర్నవీని తెలంగాణ పాపులర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. దీన్ని చర్చ అనడం కంటే కాకా పట్టడం అంటే సరిగ్గా సరిపోతుందేమో.

రాహుల్ : పునర్నవీ.. బయటకు వెళ్లాక (హౌస్ నుంచి) డేట్‌కి వస్తావా?
పునర్నవీ : డేట్ అంటున్నావ్.. అసలు నా రిలేషన్ షిప్ స్టేటస్ అడిగావా?
రాహుల్ : కొంపతీసి ఎవరితోనైనా రిలేషన్ షిప్‌లో ఉన్నావా?
పునర్నవీ : అవును.. (లవ్ స్టోరీ బయటపెట్టింది పునర్నవి)
రాహుల్: ఇంతకీ ఆ అందగాడు ఎవరు..?
పునర్నవీ : అదంతా సీక్రెట్.. నేను చెప్పను
రాహుల్ : ఇక మరేంటి నా పరిస్థితి..?
పునర్నవీ : ‘వింటున్నా.. అని నాటకాలు ఆడకు’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.

కాగా.. ఈ ఇద్దరి మధ్య డేటింగ్ డిస్కషన్ చాలా ఫన్నీగా సాగింది. అయితే ఈ ఇద్దరి మధ్య ఇలా చర్చ జరుగుతుండగా.. పక్కనే ఉన్న కెప్టెన్ వరుణ్ సందేశ్ అలాగే చూస్తూ నవ్వుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల ఎమోషనల్‌ స్పీచ్ తర్వాత రాహుల్-పునరన్నవీల మధ్య జరిగిన డిస్కషన్ బాగా ఆకట్టుకుంది.

More News

తీన్మార్ సావిత్రి ప్రేమ కథ.. కన్నీటి ప్రవాహమే!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-03 ఇప్పటి వరకూ గొడవలతో అరుపులతో ఎపిసోడ్ ముగిసిపోయేది. అయితే శుక్రవారం మాత్రం ఈ షో చూసిన వాళ్లంతా కంటతడిపెట్టుకున్నారు.

టీడీపీకి దేవినేని రాజీనామా.. జగన్ సమక్షంలో వైసీపీలోకి!

తెలుగు యువత అధ్యక్షుడు, మంత్రిగా కొడాలి నానినే ఢీ కొన్న నేత దేవినేని అవినాష్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.!

రాజకీయాలకు ‘ఇక సెలవు’ అంటున్న కుమారన్న!

అవును మీరు వింటున్నది నిజమే.. కర్నాటక మాజీ సీఎం హెచ్‌ డీ కుమారస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఓ మూర్ఖపు భక్తుల్లారా.. రాముడి పేరును అపవిత్రం చేయకండి..!

ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూ మతం ఆధారంగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.

'కథనం' ట్రైలర్ లాంచ్

ది గాయత్రి ఫిలిమ్స్ మరియు ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కథనం'.