అవినాష్ రాజేసిన నిప్పు బాగా మండింది..

  • IndiaGlitz, [Thursday,October 08 2020]

ఇవాళ షో అంతా ఫన్నీ ఫన్నీగా సాగిపోయింది. అవినాష్ చాలా ఇంటెలిజెంట్‌గా తన సీక్రెట్ టాస్క్‌ను పూర్తి చేస్తుండటంతో ఆ కారణంగా.. బాగా ఫన్ జెనరేట్ అయింది. మెహబూబ్ చాలా అమాయకంగా అవినాష్ ఉచ్చులో ఇరికి పోయాడు. మొత్తానికి అవినాష్ రాజేసిన నిప్పు బాగా మండింది. ఫుడ్‌లో వెంట్రుక రావడంతో సొహైల్ చేసిన గొడవతో షో స్టార్ట్ అయింది. ఆ తరువాత అవినాష్ తనకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లో భాగంగా ఫుడ్‌లో పిన్ వేసి ఇచ్చాడు. విషయం తెలియని అతిథులు, హోటల్ స్టాఫ్ నువ్వు చేశావంటే నువ్వే చేశావంటూ కాసేపు గొడవ పడ్డారు. పిన్ వేసి ఫుడ్ పెడతారా? అంటూ సొహైల్ గొడవ గొడవ చేశాడు. ఫైనల్‌గా లాస్య వచ్చి పొరపాటున తన హెయిర్ పిన్ పడుంటుందని.. సారీ చెప్పింది. మోనాల్ ఫోన్ చేసి ఎన్ని సార్లు హలో అన్నా అక్కడే భోజనం చేస్తున్న అఖిల్ మాత్రం రెస్పాండ్ అవలేదు. దీంతో మోనాల్ వచ్చి అఖిల్‌ని కిస్ చేసింది. అయినా అఖిల్ పట్టించుకోలేదు. నేనేం చేశాను? ఎందుకు మాట్లాడట్లేదు? చెప్పమని మోనాల్ అడిగినా అఖిల్ ఏమీ చెప్పలేదు. మరోవైపు నోయెల్‌కు ఇచ్చిన టాస్క్ ప్రకారం బెడ్ షీట్స్ మార్చారు. 100 టైమ్స్ స్విమ్మింగ్ పూల్‌లో దూకాలని గెస్ట్ మెహబూబ్ చెప్పడంతో అమ్మ రాజశేఖర్ చేశారు.

అఖిల్‌కి పుష్ అప్స్ చేయాలని చెప్పడంతో.. 79 చేశాడు. అభికి 20 కేజీల డంబెల్స్ పట్టుకుని సిటప్స్ చేయడం.. ఇవి చేసినందుకు గాను అతిథులు డబ్బులు ఇచ్చారు. అందరినీ ఇరిటేట్ చేస్తూ స్టార్స్ రాకుండా చూస్తున్నానని అవినాష్ కెమెరాకు చెప్పాడు. సీక్రెట్ టాస్క్‌లో భాగంగా మటన్‌లో ఉప్పు బాగా వేశాడు. దీంతో తినలేకపోతున్నానని మెహబూబ్.. సొహైల్‌కి చెప్పాడు. ఇక లాభం లేదు. సీరియస్ అవ్వాలని చెప్పాడు. మెహబూబ్, సొహైల్‌లకు ఫుడ్ ఇవ్వొద్దని వాళ్లిద్దరూ టిప్ ఇవ్వడం లేదని లాస్య చెప్పింది. ఇక కిచెన్ క్లోజ్‌డ్ అని ఏమీ లేవని అవినాష్ చెప్పాడు. అవినాష్‌కి టిప్ రాకుండా చూసుకుంటానని మెహబూబ్ చెప్పాడు. మొత్తానికి మటన్‌లో ఉప్పు ఎక్కువేసి ఇవ్వడంతో మెహబూబ్‌కి బాగా మండింది. నా గురించి మాట్లాడితే ఎవడు మాట్లాడితే పుచ్చ పగిలిపోద్ది అనడంతో అఖిల్ సీరియస్ అయ్యాడు. మొత్తానికి అవినాష్ పెట్టిన మంట బాగా మండింది. పుచ్చ పగిలిపోద్ది అనే వర్డ్ నువ్వు వాడకుండా ఉండాల్సిందని సొహైల్ చెప్పడంతో అఖిల్‌కి మెహబూబ్ వచ్చి సారీ చెప్పాడు.

మెహబూబ్ వెళ్లి అభికి కూడా సారీ చెప్పాడు. మేనేజర్ కంటే ఎక్కువ కనిపించారని అవినాష్‌కి మెహబూబ్ రూ.1000 టిప్ ఇచ్చాడు. ఇది చాలా ఫన్నీగా అనిపించింది. అవినాష్.. మెహబూబ్‌ని ఎంత ఫూల్‌ని చేశాడనేది అర్థమైంది. అభి ఇంటెలిజెంట్‌గా ఐదు స్టార్లను హారికకు ఇచ్చి తిరిగి తీసుకున్నాడు. దీంతో మీ చేతుల మీదుగానే మాకు ఫైవ్ స్టార్లు ఇచ్చేశారని అభి చెప్పాడు. ఇక నెక్ట్స్ డే.. నాకు ఏ సర్వీస్ కావాలన్నా నీతో చేయించుకోవచ్చని అభికి హారిక చెప్పింది. నన్నెందుకు ఆపోజిట్ టీమ్‌లో వేశారంటూ గారాలు పోయింది. మూడు స్టార్లు ఇస్తేనే సర్వీస్ చేస్తామని అభికి మెహబూబ్ చెప్పాడు. అరిచినప్పుడు నా వాయిస్ చాలా పెద్దగా ఉంటుందా? అని సొహైల్.. మోనాల్‌ని అడగటం ఫన్నీగా అనిపించింది. ఫుడ్ ప్రిపేర్ చేయడం ఆపమని అభి అమ్మ రాజశేఖర్‌కి చెప్పాడు.

చీప్‌గా మాట్లాడుతున్నావని అభిపై అమ్మ రాజశేఖర్ ఫైర్ అయ్యాడు. అమ్మ రాజశేఖర్ గురించి సుజాత.. హారికకు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. నేనసలు ఫుడ్ ఇవ్వనని సుజాత దానిని దాచేసింది. మళ్లీ అమ్మ రాజశేఖర్ దగ్గరకు అభి వచ్చి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? నేను విననని అమ్మ రాజశేఖర్ చెప్పారు. మొత్తానికి చిన్న చిన్న గొడవలతో ఫన్నీ ఫన్నీగా నేటి షో ముగిసింది. మాస్టర్ దివి కెప్టెన్సీ కోసం ఆడుతున్నాడని అభి, మోనాల్‌ల మధ్య చర్చ జరిగింది. ఇక స్టార్స్ విషయమై అభి, హారికల మధ్య చిన్న వాగ్యుద్ధం జరిగింది. మరోవైపు అవినాష్, అఖిల్‌ల మధ్య క్యాబేజీ పోటీ జరిగింది. హారిక కెమెరా ముందుకు వచ్చి ఏడ్చింది. రేపటి ప్రోమో చూస్తుంటే గరం గరంగా ఉండేలా కనిపిస్తోంది.