MP Galla Jayadev:టీడీపీకి భారీ షాక్.. పార్టీ వీడే యోచనలో ఎంపీ గల్లా జయదేవ్..?

  • IndiaGlitz, [Saturday,December 16 2023]

ఎన్నికలు దగ్గర పడే కొద్దీ టీడీపీ పరిస్థితి దిగజారుతోంది. ఓవైపు రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం సృష్టి్స్తుందని సర్వేలు చెబుతుంటే.. మరోవైపు ఎన్నికల్లో పోటీకి చేయడానికి టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదు. తాజాగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీని వీడనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి 23 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని తేల్చడంతో జయదేవ్ పార్టీని వీడినున్నట్లు సమాచారం. రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీస్తున్న తరుణంలో టీడీపీలో ఉండి లాభం లేదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి.

గల్లా బాటలో మిగిలిన నాయకులు..

టీడీపీ తరపు పార్లమెంట్‌లో కొద్దో గొప్పో తన వాణిని వినిపించగల గల్లా జయదేవ్ లాంటి వ్యక్తే పార్టీకి రాజీనామా చేయనుండటంతో మిగిలిన నాయకులు కూడా అయోమయంలో పడ్డారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే టీడీపీ ఖాళీ అయ్యేటట్లు ఉంది. దీనికి తోడు భారీగా ఆశలు పెట్టుకున్న పవన్ గ్రాఫ్‌ కూడా రోజురోజుకు పడిపోతుంది. ఇప్పటివరకు పవన్ సభ పెడితే పైసా ఖర్చులేకుండా జనం వస్తారనేది ఆయనకు ఉన్న క్రేజ్‌గా భావించేవారు. అయితే తెలంగాణా ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకపోవడంతో పవన్‌ను నమ్ముకున్న క్యాడర్ నెమ్మదిగా జారిపోతున్నారు. తాజాగా విశాఖలో జరిగిన సభకు జనం పల్చగా రావడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.

అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి..

అందుకే టీడీపీ సీనియర్ నేతలు పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు జయదేవ్ బాటలోనే మరికొంత మంది ఎంపీ స్థాయి నాయకులు ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే ఎన్నికల్లో టీడీపీకి ఎంపీ అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదట. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలు చెప్పడంతో ఎన్నికల నాటికి టీడీపీ పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశం ఉంది. దీనికి తోడు జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

More News

Bigg Boss Telugu 7 : ఫుడ్ పొగొట్టుకున్న యావర్ .. అమర్‌ సీక్రెట్ చెప్పిన అర్జున్, చెంప పగులగొట్టిన శివాజీ

బిగ్‌బాస్ తెలుగు 7 మరో రెండ్రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం హౌస్‌లో నామినేషన్స్, గొడవలు లాంటివేవి లేవు. కంటెస్టెంట్స్‌

TDP-Janasena: జనసేనతో పొత్తు.. చంద్రబాబు కుటుంబంలో రచ్చ..

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార, విపక్ష పార్టీలు కురుక్షేత్రానికి సిద్ధమయ్యాయి. సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ మిగిలిన పార్టీల కంటే ముందుకు దూసుకుపోతోంది.

Kishan Reddy:తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో ఒంటిరిగానే పోటీ చేస్తాం: కిషన్‌ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Ramgopal Varma:ఏపీ సీఎం ఎవరో తనకు తెలియదు: రామ్‌గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు.

CM Jagan:ఎన్నికలు ముందే జరగొచ్చు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ఏపీ ఎన్నికలపై మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019తో పోలిస్తే ఈసారి 20 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్