BRS Party:బీఆర్‌ఎస్ పార్టీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే..

  • IndiaGlitz, [Friday,November 24 2023]

తెలంగాణ ఎన్నికల ప్రచారం నువ్వానేనా అనే రీతిలో సాగుతోంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. అలంపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ సాదరంగా ఆహ్వానించారు. గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా అబ్రహంకే చోటు కల్పించారు. అయితే చివరి నిమిషంలో ఎమ్మెల్సీ చల్లా వెంట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజేయుడికి టికెట్ కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఉన్న ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు.

కాగా 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలంపూర్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి ప్రసన్న కుమార్‌పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ చేతిలో ఓడిపోయారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన అబ్రహం 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి జరిగే ఎన్నికల్లోనూ గెలిచి మూడోసారి ఎమ్మెల్యే అవుదామనుకున్న ఆయన ఆశలు నెరవేరలేదు. దీంతో గులాబీ పార్టీకి రాజీనామా చేసి హస్తం చెంతకు చేరారు.

ఇప్పటికే కేసీఆర్ టికెట్ నిరాకరించిన చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. వీరిలో సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, రేఖానాయక్, రాథోడ్ బాపూరావు వంటి వారు ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు దెబ్బతినే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More News

Youtuber Nani:దండం పెట్టి చెబుతున్నా.. తాను ఏ తప్పు చేయలేదు: యూట్యూబర్ నాని

విశాఖ హార్బర్ ప్రమాద ఘటనపై యూట్యూబర్ లోకల్ బాయ్ నాని స్పందించాడు. ఈ ప్రమాదానికి తనకూ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు.

CM Jagan:బెయిల్ రద్దుపై సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి కోర్టుల నుంచి నోటీసుల మీద నోటీసులు జారీ అవుతున్నాయి. తాజాగా అక్రమాస్తుల కేసులో

Bhagwant Kesari:బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చేసిన 'భగవంత్ కేసరి'..

నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది.

Bigg Boss Telugu 7 : గౌతమ్‌ను చంపలేకపోయిన శివాజీ.. కిల్లర్‌గా ప్రియాంక, శోభాశెట్టి కోసం తొండాట

బిగ్‌బాస్ 7 తెలుగు ఉత్కంఠగా సాగుతున్న సంగతి తెలిసిందే.  మిసెస్ బిగ్‌బాస్ దారుణ హత్యకు గురికావడంతో ఆమెను చంపింది ఎవరో తెలుసుకోవాలంటూ బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు.

KCR:పరేడ్ గ్రౌండ్స్‌లో కేసీఆర్ సభ రద్దు.. ఎందుకంటే..?

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడింది. ప్రచారానికి కూడా కేవలం ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది.