KCR:గులాబీ బాస్ కేసీఆర్‌కు బిగ్‌ షాక్.. ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం..

  • IndiaGlitz, [Wednesday,May 01 2024]

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. మే 1వ తేదీ రాత్రి 8 గంటల నుంచి మే 3వ తేది రాత్రి 8 గంటల వరకు ఎన్నికల ప్రచారం చేయకూడదని నిషేధం విధించింది. గత నెలలో సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదుచేశారు. దీనిపై స్పందించిన ఈసీ.. కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసి వివరణ అడిగింది.

తెలంగాణ మాండలికాన్ని స్థానిక అధికారులు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారని కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఆయన వివరణపై సంతృప్తి చెందని ఎన్నికల సంఘం రెండు రోజుల పాటు ప్రచారంపై నిషేధం విధస్తూ ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.

అయితే ఈసీ నిర్ణయంపై కేసీఆర్ స్పందించారు. తన మాట‌ల‌ను ఎన్నికల అధికారులు స‌రిగ్గా అర్థం చేసుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ నేత‌లు తాను మాట్లాడిన కొన్ని వ్యాఖ్యల‌ను ఎంపిక చేసుకొని ఫిర్యాదు చేశారని తెలిపారు. తాను మాట్లాడిన వ్యాఖ్యల‌కు ఆంగ్ల అనువాదం స‌రికాదని.. కాంగ్రెస్ విధానాలు, హామీల అమ‌ల్లో వైఫ‌ల్యాన్నే ప్రస్తావించాను అని వివ‌ర‌ణ ఇచ్చారు

కాగా ప్రస్తుతం బస్సుయాత్ర నిర్వహిస్తున్న కేసీఆర్.. అధికార కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ప్రచారంపై ఈసీ నిషేధం విధించింది. ఈసీ ఆదేశాల ప్రకారం శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అనుమతి ఉండదు. దీంతో పోలింగ్‌కు 10 రోజులు మాత్రమే సమయం ఉండటంతో గులాబీ బాస్ రెండు రోజుల పాటు ప్రచారానికి దూరం కావడం బీఆర్ఎస్‌ పార్టీకి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.

More News

Janasena: ముద్రగడ వ్యాఖ్యలు అహంకారపూరితం.. నోరు జాగ్రత్త అంటూ హెచ్చరిక..

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించడమే తన లక్ష్యం అంటూ వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ తీవ్రస్థాయిలో స్పందించారు.

CM Jagan:ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ వివాదంపై స్పందించిన సీఎం జగన్.. ఏమన్నారంటే..?

ఏపీ ఎన్నికల వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై పెద్ద రాజకీయ దుమారం రేగుతోంది. ఈ చట్టంతో ప్రజల భూములు లొక్కొంటారని..

Pushpa The Rule:ఈసారి అసలు తగ్గేదేలే.. 'పుష్ప పుష్ప' సాంగ్ అదిరిపోయింది..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప2 మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసింది.

TDP:తెలుగుదేశం మద్దతు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నాలు

దేశంలో నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. భగభగ మండే ఎండలు ఓవైపు..

Telangana: తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. బరిలో ఎంతమంది ఉన్నారంటే..?

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు 525 మంది అభ్యర్థులు