Chandrababu: బ్రేకింగ్: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట

  • IndiaGlitz, [Wednesday,January 10 2024]

ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్, ఇసుక కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. సీఐడీ తనపై నమోదైన చేసిన ఇన్నర్ రింగ్, మద్యం, ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులపై సుదీర్ఘంగా విచారణ జరగ్గా.. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం తాజాగా తుది ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో చంద్రబాబుకు భారీ ఊరట దక్కిందనే చెప్పాలి.

కాగా స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో సెప్టెంబర్ 9న చంద్రబాబును సీఐడీ అధికారులు నంద్యాలలో అరెస్టు చేశారు. అనంతరం సెప్టెంబర్ 10న విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం కోర్టు ఆదేశాలతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించారు. సెప్టెంబర్ 10 నుంచి 52 రోజులు పాటు ఆయన జైలులోనే ఉన్నారు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా హైకోర్టు ఆయనకు మధ్యంత బెయిల్ మంజూరు చేసింది.

ఇదే క్రమంలో ఆయనపై సీఐడీ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్, ఇసుక అక్రమాలపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. సుదీర్ఘంగా ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు ఈ కేసులను కొట్టివేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ ఇప్పటికే పూర్తి కాగా.. సర్వోన్నత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. తాజా పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందనే దానిపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

More News

Mahesh Babu: థ్యాంక్యూ మై హోమ్‌టౌన్ గుంటూరు.. మహేష్ ఎమోషనల్ పోస్ట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న 'గుంటూరు కారం' సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది.

Kesineni Nani: వైసీపీలోకి విజయవాడ ఎంపీ కేశినేని నాని.. జగన్‌తో భేటీ..?

ఎన్నికల వేళ విజయవాడ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. టీడీపీకి దూరమైన ఎంపీ కేశినేని నాని, ఆయన కుమార్తె శ్వేత వైసీపీలో చేరబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది.

Charminar Express: నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికులకు గాయాలు..

హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వేస్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. చెన్నైలోని తాంబరం నుంచి హైదరాబాద్ వచ్చిన చార్మినార్ సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పింది.

Mahesh Babu: ఇక నుంచి మీరే అమ్మ, నాన్న.. 'మావా ఎంతైనా' అంటున్న మహేష్..

మరో రెండు రోజుల్లో 'గుంటూరు కారం' సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే సినిమా యూనిట్ ప్రమోషన్స్‌ను హోరెత్తిస్తోంది. మంగళవారం రాత్రి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను

Film Chamber: సంక్రాంతి సినిమాల వివాదం.. మీడియాకు ఫిల్మ్‌ ఛాంబర్ వార్నింగ్..

ఈసారి సంక్రాంతికి సినిమాల విడుదల విషయంలో గతంలో ఎన్నడూ లేని వివాదాలు తలెత్తుతున్నాయి. ఈసారి పోటీ విపరీతంగా ఉండటంతో హనుమాన్ సినిమాకు థియేటర్ల కేటాయింపు విషయంలో అన్యాయం జరిగిదంటూ జోరుగా