Nara Lokesh:టీడీపీ యువనేత నారా లోకేశ్‌కు హైకోర్టులో భారీ ఊరట.. స్కిల్ స్కాం కేసు క్లోజ్

  • IndiaGlitz, [Thursday,October 12 2023]

స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఈనెల 12వరకు అరెస్ట్ చేయవద్దని ముందస్తు బెయిల్ గడువువ నేటితో ముగియడంతో హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సీఐడీ తరపు న్యాయవాదులు లోకేశ్‌ను ఈ కేసులో ముద్దాయిగా చూపలేదని.. దీంతో ఆయన్ను అరెస్ట్ చేయరని న్యాయమూర్తికి తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం లోకేశ్‌పై స్కిల్ స్కాం కేసులను కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయంతో లోకేశ్‌కు ఊరట లభించంగా.. టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు బెయిల్ పిటిషన్ ఈనెల 17కు వాయిదా..

మరోవైపు ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 17కు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ తిరస్కరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు విచారణ అక్టోబర్ 9న జరగగా.. నేటికి వాయిదా పడింది. నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

చంద్రబాబు అరెస్ట్ విషయాన్ని అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లిన లోకేశ్..

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్‌ను సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు విచారించిన సంగతి తెలిసిందే. మంగళ, బుధవారాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆయన్ను అధికారులు విచారించారు. ఈ కేసులో తనకు, తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అడిగిన ప్రశ్నలే పదేపదే అడిగారని లోకేశ్ తెలిపారు. సీఐడీ విచారణ అనంతరం ఢిల్లీ వెళ్లిన లోకేశ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. చంద్రబాబు అరెస్ట్ విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు ట్వీట్ చేశారు. సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తమ కుటుంబం మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నట్లు షాకు వివరించినట్లు పేర్కొన్నారు.

More News

CM Jagan:పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు.. చంద్రబాబు, బాలయ్యపైనా సెటైర్లు

జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) పెళ్లిళ్లపై సీఎం జగన్(CM Jagan) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Taj Mahal Tea:వాన పడితే సంగీతం .. ‘‘వాజ్ తాజ్’’ బిల్‌ బోర్డ్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు

ఏ కంపెనీకైనా, ఉత్పత్తికైనా వినియోగదారులను ఆకర్షించడం అనేది కీలకం. ఇందుకోసం కొత్త కొత్త ‘పబ్లిసిటీ’ మార్గాలను అన్వేషిస్తాయి సంస్థలు.

CM Jagan:విజయదశమి రోజున విశాఖకు షిఫ్ట్ కానున్న సీఎం జగన్.. ముగ్గురు సభ్యులతో కమిటీ

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Nagababu:బిగెస్ట్ డెవిల్స్‌తో యుద్ధం చేస్తున్నాం.. కలిసి పోరాడి వైసీపీని గద్దె దించుద్దాం: నాగబాబు

బిగెస్ట్ డెవిల్స్‌తో మనం యుద్ధం చేస్తు్న్నామని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగబాబు తెలిపారు.

Chandrababu:టీడీపీ చీఫ్ చంద్రబాబుకు మరోసారి నిరాశే.. స్కిల్ కేసులో బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.