ఏప్రిల్‌లో పెద్ద సినిమాల సంద‌డి

  • IndiaGlitz, [Monday,October 23 2017]

2018 ఏప్రిల్.. తెలుగు సినిమా విష‌యంలో ఆస‌క్తిక‌రంగా మారింది. మూడు పెద్ద ప్రాజెక్టులు వెండితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఆర్డ‌ర్ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. కింగ్‌ నాగార్జున‌, సూప‌ర్‌స్టార్‌ మ‌హేష్ బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రాలు ఏప్రిల్‌లో విడుద‌ల అయ్యే దిశ‌గా నిర్మాణం జ‌రుపుకుంటున్నాయి. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. ఇటీవ‌లే రాజుగారి గ‌ది2 లో మెంట‌లిస్ట్‌గా క‌నిపించి అల‌రించారు నాగార్జున‌. ఈ చిత్రం త‌రువాత శివ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం చేయ‌నున్నారు. న‌వంబ‌ర్‌లో ప్రారంభ‌మ‌య్యే ఈ సినిమా.. ఏప్రిల్‌లో విడుద‌ల కాబోతుంద‌ని వ‌ర్మ ప్ర‌క‌టించారు.

ఇక శ్రీ‌మంతుడు త‌రువాత మ‌హేష్‌బాబు, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రాబోయే కొత్త చిత్రం భ‌ర‌త్ అను నేను కూడా అదే నెల‌లో సంద‌డి చేయ‌నుంది. ఏప్రిల్ 20న ఈ సినిమా వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని ఇప్ప‌టికే వార్త‌లు వినిపిస్తున్నాయి కూడా. ఇక అల్లు అర్జున్ కొత్త చిత్రం నా పేరు సూర్య కూడా ఏప్రిల్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మొత్తానికి.. ఏప్రిల్ 2018 తెలుగు సినిమా ప‌రంగా ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

More News

'తారామ‌ణి' టీజ‌ర్ విడుద‌ల‌

అంజ‌లి, ఆండ్రియా, వ‌సంత్ ర‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'తారామ‌ణి'. రామ్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్నియశ్వంత్ మూవీస్ స‌మర్ప‌ణ‌లో డి.వి.సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వెంక‌టేష్ తెలుగు ప్రేక్ష‌కులకు అందిస్తున్నారు.

నిఖిల్‌తో మ‌రో కొత్త హీరోయిన్‌

స్వామిరారా, కార్తికేయ‌, సూర్య వ‌ర్సెస్ సూర్య‌, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా వంటి డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్స్‌తో స‌క్సెస్ సాధిస్తున్న యువ క‌థానాయ‌కుడు నిఖిల్ హీరోగా ఓ కొత్త చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.

'లాలిజో..లాలిజో' ట్రైలర్‌ ఆవిష్కరణ

సంభీత్‌, నేహారత్నాకరన్ హీరో హీరోయిన్లుగా జై శ్రీ సంతోషిమాత ప్రొడక్షన్‌ పతాకంపై మోహన్‌ శ్రీ వత్సస దర్శకత్వంలో షంఖు, కిరణ్‌లు నిర్మిస్తోన్న 'లాలిజో లాలిజో' చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.

మెహ‌రీన్‌దే హ‌వా

2016 ఫిబ్రవరిలో వచ్చిన కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రంతో టాలీవుడ్కి పరిచయమైంది ఉత్తరాది భామ మెహరీన్. నాని హీరోగా నటించిన ఆ సినిమా సక్సెస్ కావడంతో.. ఈ ముద్దుగుమ్మకి ఆఫర్లు క్యూ కట్టాయి.

సంఘ‌మిత్ర గా లోఫ‌ర్ భామ ఫిక్స‌య్యింది

రూ.150 కోట్లకి పైగా బ‌డ్జెట్‌తో ఓ చారిత్రాత్మ‌క చిత్రాన్ని రూపొందించ‌డానికి ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు, కుష్బూ భ‌ర్త సుంద‌ర్.సి స‌న్నాహాలు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.