భూమికకి మ‌రోసారి క‌లిసొచ్చింది

  • IndiaGlitz, [Monday,December 25 2017]

'యువ‌కుడు' చిత్రంతో 17 ఏళ్ల క్రితం తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన ఉత్త‌రాది భామ భూమికా చావ్లా.. రెండో తెలుగు చిత్రం 'ఖుషి'తో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఆ త‌రువాత 'ఒక్క‌డు', 'సింహాద్రి' వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌తో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. పెళ్ల‌య్యాక సినిమాల సంఖ్య త‌గ్గించుకున్న భూమిక‌.. తాజాగా 'ఎం.సి.ఎ' తో సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టింది. గురువారం విడుద‌లైన ఈ సినిమాకి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చినా.. వ‌సూళ్ల ప‌రంగా దూసుకుపోతోంది.

ఇక్క‌డి ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. భూమిక కెరీర్‌లో మ‌ర‌చిపోలేని చిత్ర‌మైన 'అన‌సూయ‌' విడుద‌లైన ప‌దేళ్ల త‌రువాత‌.. అదే తేది (డిసెంబ‌ర్ 21)కే ఆమె రీ ఎంట్రీ మూవీ 'ఎం.సి.ఎ' కూడా విడుద‌లైంది. అంటే.. డిసెంబ‌ర్ 21 భూమిక‌కి బాగా క‌లిసొచ్చింద‌న్న‌మాట‌. 'అన‌సూయ‌' హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కాగా.. 'ఎం.సి.ఎ' లో నానికి వ‌దిన‌గా క‌థ‌కు కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించింది భూమిక‌.

ఇదిలా ఉంటే.. నాగ‌చైత‌న్య హీరోగా రూపొందుతున్న స‌వ్య‌సాచిలోనూ భూమిక ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. వ‌చ్చే ఏడాది వేస‌వికి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

మహేష్ బాబు హీరోయిన్ కైరా అద్వానీ పెళ్లి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది..

ధోనీ సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కైరా అద్వానీ. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న 'భరత్ అను నేను' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంతో తెరకెక్కుతోన్న ఈ మూవీతో కైరా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది.

మోహన్ బాబు 'గాయత్రి' ఫస్ట్ లుక్

విలక్షణ నటుడు డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'గాయత్రి' చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైనది. క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో మోహన్ బాబు పవర్ఫుల్ లుక్ విశేషంగా ఆకట్టుకోగా, పోస్టర్ పై ఉన్న కాప్షన్ "ఆ రోజు రాముడు చేసింది తప్పు అయితే...నాదీ తప్పే" మరింత  ఆసక్తిని రేపుతోంది.

డైరెక్టర్ మారుతి క్లాప్ ఇవ్వగా ప్రారంభమైన' ఫస్ట్ ర్యాంక్ రాజు' చిత్రం

డాల్ఫిన్ ఎంటర్ టైన్ మెంట్,మారుతి టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఫస్ట్ ర్యాంక్ రాజు.

2018.. రామజోగయ్య శాస్త్రికి స్పెషల్

రామజోగయ్య శాస్త్రి..పరిచయం అక్కర్లేని పాటల రచయిత పేరిది.

రాజ్ తరుణ్ హీరోయిన్ మారింది

ఉయ్యాలా జంపాలా,సినిమా చూపిస్త మావ,కుమారి 21 ఎఫ్ చిత్రాలతో హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు యువ కథానాయకుడు రాజ్ తరుణ్.