భీమ్లా నాయ‌క్ : ముందుగా అనుకున్న డేట్‌కే.. త‌గ్గేదే లే అంటున్న ప‌వ‌న్

  • IndiaGlitz, [Tuesday,November 16 2021]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ సినిమాకి స్టార్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అందించడం విశేషం. ఈ మూవీలో రానా మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పవన్ సరసన నిత్యామీనన్ కనిపించనుండగా, రానాకు జోడీగా సంయుక్త మీనన్ సందడి చేయనున్నారు.

సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 'జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే స‌డెన్‌గా రాజమౌళి ‘‘ ఆర్ఆర్ఆర్ ’’ జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానుంద‌ని ప్ర‌క‌టించడంతో మ‌హేష్ బాబు వెన‌క్కు త‌గ్గాడు. ఏప్రిల్ లో సర్కారు వారి పాట విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు పేర్కొన్నాడు. దీంతో ప‌వ‌న్ సినిమా కూడా వాయిదా ప‌డుతుంద‌ని అంద‌రు అనుకున్నారు. ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ అవుతుందంటూ ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై చిత్ర నిర్మాతలు స్పందించారు. తమ సినిమా వాయిదా పడటం లేదని చెబుతూనే, రిలీజ్ డేట్‌తో కలిపి పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. దాంతో ఈ సినిమా ముందుగా అనుకున్న తేదీకే రావడం పక్కా అని తేలిపోయింది.

దీంతో సంక్రాంతి బ‌రిలో ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయ‌క్, రాధే శ్యామ్ మధ్య గ‌ట్టి ఫైట్ ఉండ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ మూడూ సంక్రాంతికి విడుదలయితే థియేటర్ల సమస్య తలెత్తడంతో పాటు వసూళ్లపైనా ప్రభావం చూపే అవకాశం వుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More News

ట్విట్టర్‌లో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ.. యూవీ క్రియేషన్సే టార్గెట్, నిద్రపోతున్నారా అంటూ ట్రోలింగ్

బాహుబలి వంటి ఒక సునామీ తర్వాత ప్రభాస్ నటిస్తోన్న చిత్రం రాధేశ్యామ్.

బిగ్‌బాస్ 5 తెలుగు : కాజల్‌పై షణ్ముక్ ఘాటు వ్యాఖ్యలు.. ఒక్కరు తప్ప అందరూ నామినేషన్‌లోనే.. !!

బిగ్‌బాస్ 5 తెలుగు 11వ వారంలోకి ప్రవేశించింది. గత వారం జెస్సీ అనారోగ్యం.. సీక్రెట్‌ రూమ్‌కి పంపడం, చివరికి ఆయన ఎలిమినేషన్ సైతం అయ్యారు.

'రాక్షస కావ్యం' ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రిలీజ్

నవీన్ బేతిగంటి,అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్,దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "రాక్షస కావ్యం".

సుమంత్ కొత్త చిత్రం 'అహం రీబూట్' ప్రారంభం

సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అహం రీబూట్. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్,

హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ వద్ద సినీనటి చౌరాసియాపై దాడి.. మొబైల్ చోరీ, రంగంలోకి పోలీసులు

వాకింగ్‌కు వెళ్లిన సినీనటీపై దాడి ఘటనతో తెలుగు చిత్రపరిశ్రమ ఉలిక్కిపడింది. బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్క్‌ వద్ద ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.