పాట చిత్రీక‌ర‌ణ‌లో 'భరత్ అనే నేను'

  • IndiaGlitz, [Tuesday,March 13 2018]

సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం 'భరత్ అనే నేను'. ప్రస్తుతం చిత్రీకరణ చివరిదశలో ఉంది ఈ చిత్రం. ఏప్రిల్ మొదటి వారానికల్లా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని సమాచారం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ నటిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్కు సంబంధించిన‌ టీజర్‌ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఆ టీజర్ తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పంద‌నే రాబ‌ట్టుకుంది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం మహేష్ బాబు, కైరా అద్వానీపై ఓ రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం డ్యాన్స్ కంపోజ్‌ చేశారు.

కాగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీత సార‌థ్యంలో రూపొందిన ఆడియోను ఈ ఏప్రిల్ 7న వైజాగ్‌లో భారీ ఎత్తున విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న‌ ఈ సినిమా ఏప్రిల్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

More News

చిత్రం శీను ప్రధాన పాత్రలొ 'విశ్వదాభిరామ'

సొలొ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సురేంద్ర కమల్( సురేంద్ర వంటిపులి) నిర్మిస్తొన్న థ్రిల్లర్ "విశ్వదాభిరామ" . సురేష్ కాశీ, సురేంద్ర కమల్ , అశోక్ చక్రం త్రయం  దర్శకులు.

తెలుగులోకి మ‌ళ్లీ భాగ్య శ్రీ....

బాలీవుడ్ చిత్రం 'మైనే ప్యార్ కియా' సినిమాను తెలుగులో 'ప్రేమ పావురాలు' పేరుతో  విడుద‌లై సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా త‌ర్వాత సినిమాల నుండి భాగ్య శ్రీ బ్రేక్ తీసుకున్నారు.

త‌మ‌న్‌.. ఐదోసారి

యువ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చారు. 'భాగ‌మ‌తి', 'తొలి ప్రేమ' చిత్రాల విజ‌యాల‌తో టాక్ ఆఫ్ టాలీవుడ్‌గా మారిన త‌మ‌న్‌.. ప్ర‌స్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో తెలుగులో బిజీగా ఉన్నారు.

ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'మిఠాయి'

రెడ్ యాంట్స్ పతాకంపై కమల్ కమరాజు, రవివర్మ, రాహుల్ రామకృష్ణ,. ప్రియదర్శి తదితరులు మెయిన్ లీడ్ గా నటిస్తోన్న డార్క్ కామెడీ చిత్రం 'మిఠాయి'.

న‌టుడు వంకాయ‌ల స‌త్య‌నారాయ‌ణ క‌న్నుమూత‌

అనేక చిత్రాల్లో విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న సీనియ‌ర్ న‌టుడు వంకాయ‌ల స‌త్య‌నారాయ‌ణ‌(78) ఆనారోగ్యంతో క‌న్నుమూశారు.