'భ‌ర‌త్ అనే నేను' ..ఆ సీన్స్ ఎంతో కీలకం

  • IndiaGlitz, [Tuesday,April 10 2018]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం ‘భ‌ర‌త్ అనే నేను’. ఇందులో మ‌హేష్‌కు జంట‌గా కియారా అద్వానీ న‌టించారు. తాజాగా చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నుల‌ను జ‌రుపుకుంటోంది. డి.వి.వి.దాన‌య్య నిర్మించిన ఈ చిత్రంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా మ‌హేష్ క‌నిపించ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేకంగా అసెంబ్లీ సెట్‌ను వేయించారు.

అంతేగాకుండా.. ఈ అసెంబ్లీ స‌న్నివేశాల‌ను చ‌క్క‌గా తీర్చిదిద్దార‌ట ద‌ర్శ‌కుడు. దాదాపు 15 నిమిషాల పాటు సాగే ఈ సీన్స్ సినిమాకి చాలా కీల‌క‌మ‌నీ.. ఇవే సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయ‌ని స‌మాచారం. ఈ స‌న్నివేశాల్లో వ‌చ్చే డైలాగ్స్ హృద‌యానికి హ‌త్తుకునేలా ఉంటూనే.. ఆలోచింప‌చేసేవిగా కూడా ఉంటాయ‌ని తెలుస్తోంది. ఈ అసెంబ్లీ ఘ‌ట్టం సినిమాని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్తుంద‌ని చెబుతున్నారు. అయితే.. పొలిటిక‌ల్ డ్రామాతో పాటు.. మ‌హేష్‌, కియారా మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ సీన్స్ కూడా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తాయ‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఈ నెల 20వ తేదీన ఈ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

More News

టీమ్‌కి మ‌హేశ్ బ‌హుమతి

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలోచేసిన సినిమా `భ‌ర‌త్ అనే నేను`.

ర‌జ‌నీ చిత్రంలో మ‌రో బాలీవుడ్ విల‌న్‌?

సూపర్ స్టార్ రజనీ కాంత్, త‌మిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో మ‌రో ముగ్గురు హీరోలు?

మహానటుడు ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా 'యన్.టి.ఆర్' తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ బ‌యోపిక్‌ను నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.

నితిన్‌కు మూడోసారి వ‌ర్క‌వుట్ కాలేదు?

యువ క‌థానాయ‌కుడు నితిన్‌కు క‌లిసొచ్చిన నెలల్లో ఏప్రిల్ నెల‌కు ప్ర‌త్యేక స్థాన‌ముంది. ఎందుకంటే.. గ‌తంలో ఇదే నెల‌లో నితిన్ హీరోగా న‌టించిన రెండు చిత్రాలు విడుద‌లై మంచి విజ‌యం సాధించాయి.

గోపీచంద్‌కు ఆ తేది మ‌రోసారి క‌లిసొస్తుందా?

యాక్షన్ చిత్రాల క‌థానాయ‌కుడు గోపీచంద్ న‌టిస్తున్న 25వ చిత్రం 'పంతం'. మెహరీన్ నాయిక‌. ఈ చిత్రంతో కె.చక్రవర్తి (చక్రి) దర్శకుడిగా పరిచయం కానున్నారు.