సంక్రాంతికి బేవర్స్ ఫస్ట్ లుక్

  • IndiaGlitz, [Friday,January 13 2017]

ఎస్ క్రియేషన్స్ పతాకంపై పి.చందు, ఎం అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న బేవర్స్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు సాంగ్స్ తో పాటు డెబ్బై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. జనవరి నెలాఖరు నుంచి ఫిబ్రవరి 15 వరకు జరిగే చివరి షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. మీ శ్రేయోభిలాషి వంటి ఉత్తమాభిరుచి గల చిత్రాలకు సంభాషణలు సమకూర్చిన రమేష్ చెప్పాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంజోష్, హర్షిత హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, డా.రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

గెలిచాక అందరూ నమ్ముతారు... ఫ్యామిలీ అంటే ప్రయత్నాన్ని నమ్మేవాళ్లు.. అనే కథాంశంతో యూత్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అన్ని కమర్షియల్ హంగులతో ముస్తాబవుతున్న ఈ చిత్రంలో తండ్రీ, కొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు అందరినీ కంటతడి పెట్టిస్తాయి. నెల రోజుల నుంచి నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ముద్దపప్పు ఆవకాయ ఫేం అభి, మధునందన్, అమృతం వాసు, విజయభాస్కర్, వెంకీ, షేకింగ్ షేషు, ఆర్జే హేమంత్, రాకేష్, ఫణి, వరంగల్ భాష తదితరులు నటిస్తున్నారు.

More News

నాగ్ మరోసారి బెంచ్ మార్క్ సెట్ చేసారంటున్న నాని..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి బెంచ్ మార్క్ సెట్ చేసారని నాని అంటున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే... అందరూ బాగుండాలి..! అందరి సినిమాలు విజయం సాధించాలి అని కోరుకునే మంచి మనిషి కింగ్ నాగార్జున.

సాయిధరమ్ తేజ్ విన్నర్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్..!

సాయిధరమ్తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం విన్నర్. ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బేబి భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మహేష్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డీటైల్స్..!

సూపర్ స్టార్ మహేష్ - క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.

యాంకర్ తో రైటర్...

మనం సహా పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా వర్క్ చేసిన హర్షవర్ధన ఇప్పుడు దర్శకత్వం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతమయ్యాయి.

విక్రమ్ తో నాని హీరోయిన్....

తెలుగు,తమిళంలో మంచి క్రేజ్ ఉన్న చియాన్ విక్రమ్ ఇప్పుడు వెర్సటైల్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో'ధృవనక్షత్రం'