బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ఇదే

  • IndiaGlitz, [Wednesday,August 11 2021]

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. యాక్ష‌న్ సినిమాల‌ను చేయ‌డానికి చాలా ఆస‌క్తిని చూపుతుంటారు. తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన 'ఛ‌త్ర‌ప‌తి' చిత్రాన్ని వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్‌లో రీమేక్ చేస్తుండ‌గా, ఆ రీమేక్ ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగ‌తి తెలిసిందే.

లేటెస్ట్‌గా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఎగ్జ‌యిటింగ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. 'స్టూవ‌ర్టుపురం దొంగ‌' పేరుతో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తూ టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. 1970 కాలంలో స్టూవ‌ర్టుపురం ప్రాంతానికి చెందిన ప్ర‌ముఖ గ‌జ‌దొంగ 'టైగ‌ర్ నాగేశ్వ‌ర రావు' బ‌యోపిక్ ఇది.

నాగేశ్వ‌ర‌రావు త‌న జీవిత కాలంలో పోలీసుల నుంచి జైళ్ల నుంచి ఎన్నోసార్లు చాక చాక్యంగా త‌ప్పించుకున్నాడు. చెన్నై జైలు నుంచి నాగేశ్వ‌ర‌రావు త‌ప్పించుకున్న తీరుతో ఆయ‌న‌కు 'టైగ‌ర్‌' అనే పేరు వ‌చ్చింది. పోలీసుల‌ను ముప్ప తిప్ప‌లు పెట్టిన ఈ దొంగ 1987లో పోలీసుల కాల్పుల్లో మ‌ర‌ణించాడు. ఈ విష‌యాల‌తో 'స్టూవ‌ర్టుపురం దొంగ‌' సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు.

స్టూవ‌ర్టుపురంలోని నాగేశ్వ‌ర‌రావు ఇల్లు టూరిస్ట్ స్పాట్‌గా మారింది. ఆయ‌న ఇంటి ప్ర‌ధాన ద్వారం ద‌గ్గ‌ర ఆయ‌న ఫొటో వేలాడుతుంటుంది. మోస్ట్ వాంటెడ్ దొంగ‌గా పేరు తెచ్చుకున్న టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవిత క‌థ‌ను ప‌ర్‌ఫెక్ట్ టైటిల్‌, 'స్టూవ‌ర్టుపురం దొంగ‌' పేరుతో సినిమాగా మ‌లుస్తున్నారు. ఈ పాత్ర‌ను చేయ‌డానికి బెల్లంకొండ శ్రీనివాస్ ప‌ర్‌ఫెక్ట్ చాయిస్‌. టైటిల్ పోస్ట‌ర్ విష‌యానికి వ‌స్తే, ఆవిరితో న‌డిచే రైలు బండి పొగ‌ను విడుస్తుంది. ఆ ట్రెయిన్ స్టూవ‌ర్ట్‌పురం గ్రామం మీదుగా వెళుతుంది. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం అని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ప‌రిచ‌యం చేసిన క‌థానాయ‌కుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న‌టిస్తున్న 'స్టూవ‌ర్టుపురం దొంగ‌' చిత్రంతో కె.ఎస్‌. ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో సీనియ‌ర్ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ నిర్మాతగా త‌న ప్రెస్టీజియ‌స్ బ్యాన‌ర్ ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తూ నిర్మాత‌గా క‌మ్‌బ్యాక్ అవుతున్నారు.

భారీ చిత్రంలో ఉండాల్సిన క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌న్నీ త‌గు పాళ్ల‌లో ఉండేలా అద్భుత‌మైన స్క్రిప్ట్‌ను రాశారు. వెన్నెల‌కంటి సోద‌రులు ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు. 1970-80 బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌బోతున్న ఈ హై బ‌డ్జెట్ ఎంట‌ర్‌టైన‌ర్ కోసం ప్ర‌ముఖ టెక్నీషియ‌న్స్ అంద‌రూ ప‌నిచేస్తున్నారు. మెలోడి బ్రహ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తుండ‌గా, శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. త‌మ్మిరాజు ఎడిట‌ర్‌, ఎ.ఎస్‌.ప్ర‌కాశ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది.

న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

More News

‘పాగల్’ ప్రేమను గురించి చెప్పే సినిమా - విష్వ‌క్ సేన్‌

విష్వ‌క్‌సేన్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం `పాగ‌ల్‌`.

'సైకో వర్మ - వీడు తేడా' మోషన్ పోస్టర్ విడుదల

'సైకో వర్మ' (వీడు తేడా) చిత్రం మోషన్ పోస్టర్ ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైంది. విడుదలైన కొద్ది గంటల్లోనే దీనికి విశేషమైన స్పందన లభించింది.

అర్జున్ రెడ్డి దర్శకుడి తో వైష్ణ‌వ్ తేజ్ పంజా కేతికా శ‌ర్మ షూటింగ్ ప్రారంభం

2021లో ‘ఉప్పెన’ చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సెన్సేషనల్ స్టార్ వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా

స్క్రిప్టు నచ్చితేనే సినిమా ఒప్పుకుంటా - ప్రియాంక జవాల్కర్

టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన తెలుగు బ్యూటీ ప్రియాంక జవాల్కర్. ఇటీవల స్పీడ్ పెంచిన ఈ నాయిక తిమ్మరుసు,

ఆసక్తిని రేకెత్తిస్తున్న మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ SSMB28 చిత్రం వివరాలు

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మరో చిత్రం