'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో వేడుకలో 'బంతిపూల జానకి' మోషన్ పోస్టర్ లాంచ్!!

  • IndiaGlitz, [Saturday,March 19 2016]
ధన్ రాజ్, దీక్షాపంత్, షకలక శంకర్, అదుర్స్ రఘు, వేణు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, సుడిగాలి సుదీర్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న చిత్రం ""బంతిపూల జానకి". హాస్యానికి పెద్ద పీట వేస్తూ "ఆద్యంతం అత్యంత ఉత్కంఠభరితం" అనిపించేలా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై కళ్యాణిరామ్ నిర్మిస్తున్నారు. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్సకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను "సర్దార్ గబ్బర్ సింగ్" ఆడియో వేడుక సందర్భంగా.. "సర్దార్ గబ్బర్ సింగ్" ఆడియో ఫంక్షన్ ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న ఎన్. టీవీలో రిలీజ్ చేయనున్నారు.
ఈ సందర్భంగా ధన్ రాజ్ మాట్లాడుతూ.. "పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి "సర్దార్ గబ్బర్ సింగ్" ఆడియో విడుదల సందర్భంగా "బంతి పూల జానకి" మోషన్ పోస్టర్ ను ఎన్. టీవీలో రిలీజ్ చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని ఈ సమ్మర్ లోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
డాక్టర్ భరత్ రెడ్డి, ఫణి, కోమలి, జీవన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: శివ వై.ప్రసాద్, కెమెరా: జి.ఎల్.బాబు, కథ-మాటలు: శేఖర్ విఖ్యాత్, సంగీతం: బోలె, నిర్మాత: కళ్యాణిరామ్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్!!

More News

వ‌ర్మ ట్వీట్స్ పై ప‌వ‌న్ రిప్లై..

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మెగాస్టార చిరంజీవి - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌పై వార్త‌ల్లో ఉండేలా ఏదో ఒక ట్వీట్ చేస్తునే ఉంటార‌న్న విష‌యం తెలిసిందే.

వీణ స్టెప్పు - సాంగ్ గురించి ప‌వ‌న్ ఏమ‌న్నారు..

స‌ర్ధార్ సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ అంచ‌నాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీనికి తగ్గ‌ట్టు రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డంతో అభిమానులు సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి ప‌వ‌న్ మాట‌..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో ఫంక్ష‌న్ కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు స‌ర్ధార్ గబ్బ‌ర్ సింగ్ ఆడియో రిలీజ్. ఏప్రిల్  8 స‌ర్ధార్ సినిమా రిలీజ్. అయితే స‌ర్ధార్ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ తో సినిమా చేస్తున్నాన‌ని దాస‌రి ప్ర‌క‌టించారు.

ఫ్యాన్స్ పాస్ ఉంటే రండి..పాస్ లేక‌పోతే రావ‌ద్దు - ప‌వ‌న్ క‌ళ్యాణ్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ సెన్సేష‌న్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. బాబీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మకంగా నిర్మించారు.

'నేనోరకం' అంటున్న సాయిరామ్ శంకర్

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొంది.