29న 'బంతిపూల జానకి' ఆడియో!!

  • IndiaGlitz, [Sunday,July 24 2016]

సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు, లేదా భారీ బ్యాక్ గ్రౌండ్ గలవారు నిర్మించే సినిమాల ఆడియో వేడుకలు మాత్రమే హైద్రాబాద్, హైటెక్ సిటీకి సమీపంలో గల "శిల్ప కళా వేదిక"పై జరుగుతాయి. కానీ తొలిసారిగా "బంతిపూల జానకి" అనే ఓ చిన్న సినిమా ఆడియో వేడుకకు "శిల్ప కళా వేదిక" వేదిక కానుంది.

ఈ నెల 29, శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి "బంతిపూల జానకి" ఆడియో వేడుక "మాంచి జబర్దస్త్"గా జరగనుంది. ఈ చిత్రం గీతాలు "మ్యాంగో మ్యూజిక్" ద్వారా మార్కెట్ లో లభ్యం కానున్నాయి. ధన్ రాజ్, దీక్షాపంత్, షకలక శంకర్, అదుర్స్ రఘు, వేణు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, సుడిగాలి సుధీర్ ముఖ్య తారాగణంగా.. హాస్యానికి పెద్ద పీట వేస్తూ.. "ఆద్యంతం అత్యంత ఉత్కంఠభరితం" అనిపించేలా తెరకెక్కుతున్న ఈ కామెడీ థ్రిల్లర్ ను ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై కళ్యాణి-రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొద్యూసర్ తేజ.

ఈ సందర్భంగా దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ.. "ఆర్టిస్టులు మరియు సాంకేతిక నిపుణులందరి సహాయ సహకారాలతో కామెడి థ్రిల్లర్ గా రూపొందుతున్న "బంతిపూల జానకి" చిత్రం అవుట్ పుట్ చాలా సంతృప్తిగా వచ్చింది. 2016లో ఘన విజయం సాధించబోయే చిన్న చిత్రాల జాబితాలో "బంతిపూల జానకి" తప్పక స్థానం సంపాదించుకుంటుంది" అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తేజ మాట్లాడుతూ.. "బోలె సంగీతం "బంతిపూల జానకి" చిత్రానికి మెయిన్ ఎస్సెట్ గా నిలుస్తుంది. ఈ నెల 29న ఆడియో విడుదల చేసి.. ఆగస్టు 19న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు!!

More News

రీరికార్డింగ్ దశలో ఆది 'చుట్టాలబ్బాయి'

లవ్ లీ రాక్ స్టార్ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్,ఎస్.ఆర్.టి.మూవీ హౌస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో

'కబాలి' ట్రిమ్మింగ్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సెన్సేషనల్ కలెక్షన్స్ సాధిస్తుంది.

వెంకీ వారికి థాంక్స్ చెబుతాడట....

హీరో విక్టరీ వెంకటేష్,నయనతార కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్పై ఎస్.నాగవంశీ నిర్మించిన చిత్రం 'బాబు బంగారం'.

'మనమంతా' లో నందమూరి హీరో గెస్ట్ రోల్....

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజనీకొర్రపాటి నిర్మాతగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో

బిచ్చగాడు మదరే మహేష్ మదర్ గా...

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్వీ ప్రసాద్ నిర్మాతగా ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.