80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న 'బంతిపూల జానకి'

  • IndiaGlitz, [Tuesday,March 01 2016]

ధన్ రాజ్, దీక్షాపంత్, షకలక శంకర్, అదుర్స్ రఘు, వేణు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, సుడిగాలి సుదీర్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న చిత్రం ""బంతిపూల జానకి". హాస్యానికి పెద్ద పీట వేస్తూ "ఆద్యంతం అత్యంత ఉత్కంఠభరితం" అనిపించేలా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై కళ్యాణిరామ్ నిర్మిస్తున్నారు. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్సకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికి 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకొంది.
ఈ సందర్భంగా దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ.. "ఆర్టిస్టులు మరియు సాంకేతిక నిపుణులందరి సహాయ సహకారాలతో కామెడి థ్రిల్లర్ గా రూపొందుతున్న "బంతిపూల జానకి" చిత్రం షూటింగ్ 80 శాతం పూర్తి చేశాం. అవుట్ పుట్ చాలా సంతృప్తిగా వస్తోంది. 2016లో ఘన విజయం సాధించబోయే చిన్న చిత్రాల జాబితాలో "బంతిపూల జానకి" తప్పక స్థానం సంపాదించుకుంటుంది. త్వరలో జరిగే చివరి షెడ్యూల్ లో ఒక పాటతోపాటు మిగిలిన టాకీ పార్ట్ కంప్లీట్ చేస్తాం" అన్నారు.
డాక్టర్ భరత్ రెడ్డి, ఫణి, కోమలి, జీవన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: శివ వై.ప్రసాద్, కెమెరా: జి.ఎల్.బాబు, కథ-మాటలు: శేఖర్ విఖ్యాత్, సంగీతం: బోలె, నిర్మాత: కళ్యాణిరామ్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్!!

More News

పవన్ వాయస్ ఓవర్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు,రాజకీయాలే కాకుండా అవేర్ నెస్ కోసం ఓ యాడ్ లో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడట.

అందుకే తమన్నా చేస్తుందట...

మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు తెలుగు,తమిళంలో విడుదల కానున్న ద్విభాషా చిత్రం ఊపిరి విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

మార్చి 18న వస్తున్న 'మేము'

సూపర్ స్టార్ సూర్య-అమలాపాల్-బిందుమాధవి నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన "పసంగ-2"తెలుగులో "మేము" పేరుతో అనువాధమవుతుండడం తెలిసిందే.

ప్రేమకథకు ఓకే చెప్పిన హేబా...

కుమారి 21ఎఫ్ చిత్రంతో టాలీవుడ్ యూత్ కు దగ్గరైన హీరోయిన్ హేబాపటేల్ ఇప్పుడు విష్ణు హీరోగా,

ప్రభాస్ తో మూవీ ప్లాన్ చేస్తున్నమనోజ్ డైరెక్టర్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.